Actress Priyamani: సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయింది. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించుకుని ప్రేమలో కొన్ని సంవత్సరాల పాటు విహరించి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వీరి వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాలు కూడా గడవకు ముందే తెగ తెంపులు చేసుకుంటున్నారు.
ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా బ్రతుకుతున్నారు. మరికొందరు రెండో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక జంట కూడా విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ముస్తఫా రాజ్ ఇదివరకే పెళ్లి చేసుకొని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ప్రియమణితో ప్రేమలో పడిన ఈయన తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిపోయింది. ఇకపోతే తన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ పెళ్లి చేసుకున్నారని,ప్రియమణి పెళ్లి చెల్లదు అంటూ మధ్యలో పెద్ద వివాదం సృష్టించారు. అయినప్పటికీ ప్రియమణి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ప్రియమణి ముస్తఫా రాజ్ వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోతున్న పిల్లల గురించి ప్రియమణి ఏమాత్రం ఆలోచించలేదని తను కెరియర్ లో సెటిల్ అయిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చింది.ఇక పిల్లల విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవలు జరిగాయని అందుకే వీరిద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా తన విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…