Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.ఇలా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన ఈ కార్యక్రమం నుంచి ఈమె వెళ్లిపోవడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై నోరు విప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్తుంటే తన సొంత ఇంటిని వదిలి వెళుతున్నాను అనే బాధ తనలో కలిగిందని, టీవీ కార్యక్రమాలకు తాను దూరం అవుతానా అనే భయం కూడా తనలో కలిగిందని ఈమె తెలిపారు. ఇకపోతే తాను ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్న మొదట్లో చాలామంది నువ్వు మేకప్ వేసుకోగలవా? కెమెరాను ఫేస్ చేయగలవా? అంటూ ప్రశ్నించినట్లు ఈమె తెలిపారు.
మనం ఇదే రంగం అని కాదు ఏ రంగంలోకి వెళ్లిన చెడు మంచి అనేది ఉంటాయి. అయితే మనం ఎంచుకొనే గమ్యం పట్టి మన ప్రయాణం ఉంటుందని అనసూయ వెల్లడించారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం తనకు ఎంతో మంచి పేరు తెచ్చిందని అయినా కానీ ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా పడ్డానని ఈమె తెలిపారు. ఇలా నాకు ఈ కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల వల్లే తాను బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని ఈమె తెలిపారు.
తనకు తన ఆత్మ గౌరవం కన్నా ఏది ముఖ్యం కాదని మన ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఈమె తెలిపారు. ఇక ఈ ఫీల్డ్ లో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే తాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తాను ఎంబీఏ చదివానని అలా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతానని తెలిపారు.ఇక అక్కడ కూడా ఇబ్బందులు ఎదురైతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటాను కానీ తన ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ చంపుకోనని అనసూయ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…