Actor Nikhil: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ2. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ తిరిగి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైనప్పటినుంచి మంచి టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదల కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడుతున్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా థియేటర్లు దొరక్కుండా చేశారంటూ నిఖిల్ బాధపడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నిఖిల్ సినిమా విడుదల విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు హస్తం కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ…ఈ సినిమా విడుదల వాయిదా విషయంలో దిల్ రాజు ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పాలంటే ఆయన మద్దతు వల్లే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి అంటూ నిఖిల్ దిల్ రాజు గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రకారం ఒకే రోజే ఇద్దరి హీరోల సినిమాలు విడుదలయితే కలెక్షన్ల పరంగా పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయని చెప్పడం వల్లే తాను మరోసారి తన సినిమాని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని నిఖిల్ తెలిపారు.
ఇకపోతే ఒక మంచి సినిమా ఇలా తరచూ వాయిదా పడటంతోనే తాను బాధపడ్డానని, తాను ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నా సినిమా విడుదలకు ఫలానా వాళ్లు కారణమంటూ ఎక్కడ ప్రస్తావించలేదని ఈయన వెల్లడించారు. మొత్తానికి అనుపమ నటించిన ఈ సినిమా కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం నిఖిల్ దిల్ రాజు గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…