Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
ఇకపోతే ఈ రౌడీ హీరో సినిమాలు వస్తున్నాయని తెలిస్తే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి. ఇలా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చేంత అభిమానులు ఉన్నారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విజయ్ దేవరకొండకు అభిమానులుగా మారిపోయారు. ఆయన పక్కన ఛాన్స్ వస్తే చాలు నటించడానికి సిద్ధంగా ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి వాళ్ళు కూడా తనతో డేట్ కి వెళ్లాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వస్తే ముఖానే నటించనని ఒక హీరోయిన్ చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికొస్తే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో తాను నటించనని చెప్పారట.
ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉండడంతో అలాంటి సన్నివేశాలలో తాను నటించలేనని అందుకే ఈ సినిమాని వదులుకున్నట్లు సమాచారం.ఈ సినిమానే కాదు భవిష్యత్తులో తనతో కలిసి ఎలాంటి సినిమాలలో కూడా నటించమని సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక తన సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని అందుకే తన సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా లేనంటూ సాయి పల్లవి విజయ్ దేవరకొండ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…