Tag Archives: National Award

Allu Arjun: అల్లు అర్జున్ కు అవార్డు వస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన స్టార్ హీరోయిన్… అదే జరిగిందిగా?

Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటారని రష్మిక ముందుగానే జోస్యం చెప్పారట.

ఇలా అల్లు అర్జున్ ఈసినిమాలో ఎంతో కష్టపడి నటించారు అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కష్టం గురించి రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు మాత్రమే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయి అని చెప్పారట ఈ సినిమాలో ఆయన ఎంతో కష్టపడ్డారని కేవలం మేకప్ కోసమే మూడు గంటల పాటు వెయిట్ చేసేవారని రష్మిక తెలిపారు.

ఇలా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినటువంటి అల్లు అర్జున్ కు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందని, ఆయనకు కనుక అవార్డు రాకపోతే బాధపడే మొదటి వ్యక్తిని తానేను అంటూ అప్పట్లోనే రష్మిక అల్లు అర్జున్ నటనకు తప్పనిసరిగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ రష్మిక చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Allu Arjun: బాధపడే వ్యక్తిని నేనే…


రష్మిక ఆరోజు చెప్పిన విధంగానే అల్లు అర్జున్ కొన్ని నేషనల్ అవార్డు రావడంతో ఈమె చెప్పిన జోస్యం నిజమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో నటించారు. ఇక రష్మిక అల్లు అర్జున్ ఈ సినిమాలో జోడిగా నటించడమే కాకుండా వీరిద్దరూ డి గ్లామర్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం.

Roja Ramani: తరుణ్ కు నేషనల్ అవార్డు రావడంతో బాగా ఏడ్చేసాము…. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి రోజా రమణి!

Roja Ramani: నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా రమణి భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాద పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రహల్లాద పాత్రలో నటించిన రోజా రమణికి తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు.

ఇక ఈమె తన కుమారుడు తరుణ్ ను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనంతరం తరుణ్ కూడా ఇండస్ట్రీలో హీరోగా అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఎంత తొందరగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారో అంతే తొందరగా ఫెయిడౌట్ అయ్యారు. అయితే తాజాగా నటి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.

తాను భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహల్లాదుడి పాత్రలో నటించినందుకు గాను ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు వచ్చిందని తెలిపారు. అయితే తరుణ్ సైతం బాలనటుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇలా తరుణ్ మొదటి సినిమాకే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది.

Roja Ramani: మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్…

ఒకరోజు టీవీలో న్యూస్ చూస్తున్న సమయంలో నేషనల్ అవార్డు ప్రకటన వచ్చింది. అయితే అంజలి సినిమాకు గాను మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో మాస్టర్ తరుణ్,బేబీ శృతి బేబీ షాలిని అని మూడు పేర్లు స్క్రోల్ అయ్యాయి. అయితే ఇది చూసి మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం కానీ తిరిగి ఈ వార్తలను చూడటానికి కుదరదు కనుక వెంటనే ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం మణిరత్నం గారికి ఫోన్ చేసాము ఆయన అసలు విషయం చెబుతూ హ్యాపీయేనా అంటూ అడిగారని, ఆ క్షణం ఒక్కసారిగా నేను నా భర్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నామని ఈ సందర్భంగా రోజా రమణి తరుణ్ మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్న సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.

Actress Sharada: మూడుసార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఒక్క సీన్ కోసం 20 టేకులు తీసుకున్న సీనియర్ నటి శారద?

Actress Sharada: సాధారణంగా సినిమాలలో నటించాలంటే అన్ని రకాల ఎమోషన్స్ మనము వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సన్నివేశానికి అనుగుణంగా నటీనటులు తమహావ భావాలను పలికించాలి. అయితే కొన్నిసార్లు ఎంతో మహానటులు నటీమణులు అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు చేయడానికి కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎక్కువ టేకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ క్రమంలోనే నటి శారద తన సినీ కెరియర్లో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను అందుకోవడమే కాకుండా మూడుసార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నప్పటికీ ఈమె ఒక్క సన్నివేశం చేయడానికి ఏకంగా 20 టేకులు తీసుకోవడం గమనార్హం. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు శారద హీరో హీరోయిన్లుగా వచ్చిన శారద అనే సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.

ఈ సినిమాలో శారద మతిస్థిమితం కోల్పోయిన అమ్మాయిగా కనిపించాల్సి ఉంటుంది. అయితే ఒక సన్నివేశంలో శోభన్ బాబు డాక్టర్ గా ఉండగా శారద సోదరుడు తనని పట్నం తీసుకెళ్లి తన పరిస్థితిని చెప్పగా శోభన్ బాబు తాను పట్నం రావాల్సిన పనిలేదు నేనే తన ఊరికి వస్తానని శారద వెంట తన ఊరికి వెళ్తారు. శోభన్ బాబు లోపలికి రావడం చూసి ఆమె శోభన్ బాబుని తన భర్త అని భావించి తనని ఎందుకు వదిలి వెళ్లారు.. తనకెందుకు అన్యాయం చేశారంటూ కాళ్లపై పడి ఏడ్వాల్సి ఉంటుంది.

Actress Sharada: చివరి టేక్ ఓకే చేసిన డైరెక్టర్…

ఈ సన్నివేశం చేయడం కోసం శారద నుంచి డైరెక్టర్ విశ్వనాథ్ గారికి రావలసిన ఫీల్ రాకపోవడంతో ఆయన ఏకంగా ఈ సన్నివేశం కోసం 20 టేకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా 20 టేకుల చేసిన అనంతరం విశ్వనాథ్ గారు చివరి టేక్ ఓకే చేశారట.నటీనటులను ఏమాత్రం విసుక్కోకుండా తనకు కావలసిన సన్నివేశం కావలసిన విధంగా వచ్చేవరకు విశ్వనాథ్ గారు ఎంతో ఓపికగా ఎన్ని టేక్స్ అయినా కానీ సన్నివేశాన్ని తెరకెక్కించడం ఆయన నైజం. అందుకే ఆయన సినిమాలు ఎంతో సహజంగా ఉంటాయని చెప్పాలి.