Actress Sharada: సాధారణంగా సినిమాలలో నటించాలంటే అన్ని రకాల ఎమోషన్స్ మనము వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సన్నివేశానికి అనుగుణంగా నటీనటులు తమహావ భావాలను పలికించాలి. అయితే కొన్నిసార్లు ఎంతో మహానటులు నటీమణులు అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు చేయడానికి కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎక్కువ టేకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ క్రమంలోనే నటి శారద తన సినీ కెరియర్లో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను అందుకోవడమే కాకుండా మూడుసార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నప్పటికీ ఈమె ఒక్క సన్నివేశం చేయడానికి ఏకంగా 20 టేకులు తీసుకోవడం గమనార్హం. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు శారద హీరో హీరోయిన్లుగా వచ్చిన శారద అనే సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.
ఈ సినిమాలో శారద మతిస్థిమితం కోల్పోయిన అమ్మాయిగా కనిపించాల్సి ఉంటుంది. అయితే ఒక సన్నివేశంలో శోభన్ బాబు డాక్టర్ గా ఉండగా శారద సోదరుడు తనని పట్నం తీసుకెళ్లి తన పరిస్థితిని చెప్పగా శోభన్ బాబు తాను పట్నం రావాల్సిన పనిలేదు నేనే తన ఊరికి వస్తానని శారద వెంట తన ఊరికి వెళ్తారు. శోభన్ బాబు లోపలికి రావడం చూసి ఆమె శోభన్ బాబుని తన భర్త అని భావించి తనని ఎందుకు వదిలి వెళ్లారు.. తనకెందుకు అన్యాయం చేశారంటూ కాళ్లపై పడి ఏడ్వాల్సి ఉంటుంది.
ఈ సన్నివేశం చేయడం కోసం శారద నుంచి డైరెక్టర్ విశ్వనాథ్ గారికి రావలసిన ఫీల్ రాకపోవడంతో ఆయన ఏకంగా ఈ సన్నివేశం కోసం 20 టేకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా 20 టేకుల చేసిన అనంతరం విశ్వనాథ్ గారు చివరి టేక్ ఓకే చేశారట.నటీనటులను ఏమాత్రం విసుక్కోకుండా తనకు కావలసిన సన్నివేశం కావలసిన విధంగా వచ్చేవరకు విశ్వనాథ్ గారు ఎంతో ఓపికగా ఎన్ని టేక్స్ అయినా కానీ సన్నివేశాన్ని తెరకెక్కించడం ఆయన నైజం. అందుకే ఆయన సినిమాలు ఎంతో సహజంగా ఉంటాయని చెప్పాలి.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…