Tag Archives: new movie

ఆకట్టుకుంటున్న కళ్యాణ్ దేవ్ “సూపర్ మచ్చి” టీజర్.. !

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో కళ్యాణ్ దేవ్ ఒకరు. ఈయన విజేత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా శ్రీజను వివాహం చేసుకున్న తర్వాత విజేత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈక్రమంలోనే కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సూపర్ మచ్చి”. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి దీపావళి పండుగ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

కళ్యాణ్ దేవ్, రియా చక్రవర్తి, రచిత రామ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోని తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అలాగే శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, పోసాని, ప్రగతి కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జోరు పెంచనున్న ‘నాగార్జున’.. జూన్ నుంచి నాగ్ కొత్త సినిమా మొదలు..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి.. ఈ సీనియర్ హీరోకి మంచి హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకా పోయింది. సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించారు నాగ్ .

ప్రభు సోలొమన్ టేకింగ్ కూడా రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది.సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నాగ్ స్టోరీ సెలెక్షన్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమాలో ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది.

ఈ క్రమంలో నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది.ఈ సినిమాలో నాగ్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ను జూన్‌ తొలివారంలో ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో నాగార్జున, కాజల్‌ అగర్వాల్‌లపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌లో పాటు ఊటీ, లండన్‌, దక్షిణ కొరియాలో ముఖ్యఘట్టాల్ని తెరరకెక్కిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడట నాగ్..!!

ఆ డైరెక్టర్ కోసం సీనియర్ హీరోకి ఓకే చెప్పిన శృతిహాసన్..!!

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.ముఖ్యంగా మన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్ ని వెతకడం అనేది డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. నిజం చెప్పాలంటే బాలయ్య సినిమా కోసం డైరెక్టర్లు ఎప్పుడూ అరడజను మంది స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతారు. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్క హీరోయిన్ కూడా బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకోదు, ఒప్పుకున్నా ఏవరేజ్ హీరోయిన్ కూడా భారీగా రెమ్యూనరేషన్ అడుగుతుంది.

దాంతో ఆ హీరోయిన్ ను నిర్మాత ఒప్పుకోడు.చివరకు బాలయ్య చిన్నాచితకా హీరోయిన్లే దిక్కు అవుతున్నారు. అందుకే, ఈ సారి బాలయ్య కాస్త తెలివిగా ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా తరువాత, గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ఫిక్స్ అయ్యాడు. మంచి హీరోయిన్ ను బుక్ చేయండి అని బాలయ్య, ఇప్పటికే డైరెక్టర్ తో చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి తన పక్కన ఏ హీరోయిన్ నటిస్తోంది అని బాలయ్య పెద్దగా పట్టించుకోడు,అయితే, తన మిత్రులలో ఒకతను ‘మీ పక్కన ఏ స్టార్ హీరోయిన్ యాక్ట్ చేయదా ?’ అంటూ ప్రశ్నించాడట.

దాంతో బాలయ్యకి ఇగో హర్ట్ అయింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తన తరువాత సినిమాలో స్టార్ హీరోయినే ఉండాలని పట్టుబట్టాడు. అందుకే శృతి హాసన్ ను బాలకృష్ణ సరసన నటించేలా చేయడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని తన తెలివిని ఉపయోగించి, శృతి హాసన్ ను ఒప్పించాడని తెలుస్తోంది. గోపీచంద్ ‘క్రాక్’ సినిమాతో శృతి హాసన్ కి మంచి హిట్ ఇచ్చాడు.దాంతో, శృతి హాసన్ కి, గోపీచంద్ మలినేని కోసం సమైనా బాలకృష్ణ సరసన నటించక తప్పడం లేదట.

బాలయ్య పక్కన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోయినా… మొత్తానికి శృతి హాసన్, డైరెక్టర్ కోసం ఒప్పుకుంది. అయితే, బాలయ్య సరసన శృతి హాసన్ నటించాక ఆమెకు ఇక ‘సీనియర్ హీరోయిన్’ అనే ముద్ర పడటం ఖాయం.ఆ తర్వాత ఇక ఏ యంగ్ హీరో సరసన ఆమెకు అవకాశాలు రావు. అయినా 35 ఏళ్ల శృతి హాసన్ కి ఏ యంగ్ హీరో మాత్రం ఛాన్స్ ఇస్తాడు.మరి ఈ సినిమా తర్వాత శ్రుతిహాసన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి…!!

నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే ‘బాలయ్య’ కొత్త సినిమా..!!

నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక పాత్రలో బాలయ్య అఘోరా లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఇటీవల విడుదలైన అఖండ టీజర్ 55 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది..ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఇక బాలయ్య సినిమా విషయానకి వస్తే.. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా ఈ సినిమా రానుందట. జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు.ఇక ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తోంది..!!

తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ పాన్ ఇండియా డైరెక్టర్ తో ‘ఎన్టీఆర్’ సినిమా ఫిక్స్..!!

టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. అయితే ఈ సినిమా దతర్వాత తారక్ ఫ్యూచర్ సినిమాల లైనప్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందుగా తనకు ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అతను ఓ సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అప్పుడప్పుడూ అప్‌డేట్లు వస్తున్నాయి కానీ.. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడింది లేదు.’కేజీఎఫ్-2′ పూర్తవగానే ఎన్టీఆర్‌తో సినిమా అనుకుంటే ప్రశాంత్ ఉన్నట్లుండి ‘సలార్’ను ముందుకు తీసుకురావడం, మధ్యలో అల్లు అర్జున్ సైతం ప్రశాంత్‌తో ఓ సినిమా కోసం చర్చలు జరపడంతో ఎన్టీఆర్-ప్రశాంత్ సినిమా మీద కొంత సందేహాలు నెలకొన్నాయి.

ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ తొలిసారిగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా గురించి నోరు విప్పాడు. ప్రస్తుతం కరోనా బారిన పడి ఇంట్లో కోలుకుంటున్న తారక్.. అంతర్జాతీయ ఫిలిం ట్రేడ్ పబ్లికేషన్ ‘డెడ్ లైన్’కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తారక్ కరోనా పాజిటివ్‌గా తేలడానికి ముందు ఇచ్చాడా, తర్వాతా అన్నది తెలియదు. ఐతే ఆ ఇంటర్వ్యూ మాత్రం తాజాగా పబ్లిష్ అయింది.ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే అని తారక్ ధ్రువీకరించాడు.

‘జనతా గ్యారేజ్’ తర్వాత తమ కలయికలో రానున్న సినిమా కోసం ఉత్సాహంగా ఉన్నానని.. ఐతే ఈ సినిమాకు ఇంకా స్క్రిప్టు పూర్తి కాలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమా కోసం ఒక ఐడియా అనుకున్నామని, అది తనకెంతో నచ్చిందని, దాని మీద వర్క్ జరుగుతోందని తారక్ తెలిపాడు. ఈ చిత్రం తర్వాత తాను ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో నటించబోతున్నట్లు చెప్పాడు.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..!!