Tag Archives: paruchuri gopala krishna

Salaar: ప్రశాంత్ డైరెక్టర్ కావడంతో సలార్ హిట్ అయింది.. పరుచూరి కామెంట్స్ వైరల్?

Salaar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైన కథలను అందిస్తూ రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇకపోతే పరుచూరి ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాలు విడుదలయితే ఆ సినిమాల గురించి విశ్లేషణ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా సలార్ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ప్రభాస్ ఏ సినిమా ద్వారా హిట్ అందుకోలేదు కానీ సలార్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా గురించి పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘిక అంశాలు అన్నీ మేళవించి ప్రశాంత్ సలార్ సినిమా రూపొందించారని వివరించారు.

అయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాకుండా మరి ఏ డైరెక్టర్ అయిన ఈ సినిమాని కనుక చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యదని ఆయన కాబట్టి సినిమా హిట్ అయ్యిందని తెలిపారు. ఇక మొదటి 30 నిమిషాల పాటు ప్రభాస్ కి ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.

స్క్రీన్ ప్లే అద్భుతం..


సినిమాలో కాన్సర్ అనే ప్రాంతాన్ని చరిత్రతో మిక్స్ చేసి చూపించాడు.ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉందని యాక్షన్స్ సన్ని వేషాలు కూడా చాలా అద్భుతంగా చూపించారని గోపాలకృష్ణ సలార్ సినిమా పట్ల తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు రెండవ భాగం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Paruchuri Gopala Krishna: కృష్ణ అడగకుండానే ఇంటి కోసం సహాయం చేశారు: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా కృష్ణా మరణంతో సీనియర్ హీరోల శకం ముగిసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.ఇదిలా ఉండగా కృష్ణ గారితో పనిచేసినటువంటి సెలబ్రిటీలు రచయితలు దర్శకనిర్మాతలు ఆయనతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ కృష్ణ గారి మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన మంచితనాన్ని బయటపెట్టారు.కృష్ణ గారు తనకు అడగకుండానే సహాయం చేశారని ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఈయన తెలిపారు.

బంగారు భూమి సినిమా కోసం తాను నాలుగైదు డైలాగులు రాసానని ఇలా రాసినందుకే తన పేరుని మొదట్లో వేయించుకోమని చెప్పారు. కానీ నేను వద్దని చెప్పాను. ఇక ఈ సినిమాలో పద్మ మనిషిని నమ్ముకుంటే మన నోట్లో మట్టి కొడతాడు.. అదే మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది.ఆ మట్టికి నమస్కారం చేయి అనే డైలాగ్ విన్న తర్వాత కృష్ణ గారు ఎంతో అద్భుతంగా ఉంది ఎవరు రాశారు అని అడిగారు అప్పుడు పి సి రెడ్డి గారు ఆ డైలాగ్ నేను రాసానని కృష్ణ గారికి చెప్పారు.

Paruchuri Gopala Krishna: గొప్ప రచయిత అవుతా అంటూ జోస్యం చెప్పారు…

ఈ డైలాగ్ విన్న అనంతరం నేను ఇండస్ట్రీలో పెద్ద రచయిత అవుతానని అప్పట్లోనే కృష్ణ గారు జోస్యం చెప్పారని పరుచూరి వెల్లడించారు.హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ ఎంతోమందికి సహాయ సహకారాలు చేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ క్రమంలోనే అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో తన ఇంటి నిర్మాణానికి డబ్బు సహాయం చేశారని ఇలా కృష్ణగారు డబ్బు సహాయం చేయడంతోనే ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టానని, అదే మంచితనమే మహేష్ బాబుకు కూడా వచ్చింది అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా కృష్ణ గారిని తలుచుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాలకృష్ణను జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి ఎక్కడ ఎలా కలిసారో తెలుసా?

నందమూరి వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి వీరిద్దరూ బాబాయ్.. అబ్బాయ్ వరస అవుతారనే ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణను మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఎలా కలుసుకున్నారనే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ తో ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ… పాలకొల్లులో ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అదే సమయంలో అక్కడ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ బాలకృష్ణ వంటి వారందరూ ఉన్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పరుచూరి గోపాల కృష్ణ దగ్గరికి వెళుతూ మీరు తాత ఎన్టీఆర్ గారికి ఎలా అభిమానో.. నేను బాలకృష్ణ గారికి అంత అభిమానిని అని తెలియజేశారు.

బాబాయి సినిమా థియేటర్ లో చూస్తుంటే పేపర్లు చించి విసిరేస్తూ ఎంజాయ్ చేశానని తెలిపారు.ఆ మాటలు విన్న పరుచూరి మరి ఈ విషయాన్ని మీ బాబాయికి చెప్పావా అని అడిగా.. లేదు నాకు బాబాయి అంటే భయం అందుకే ఈ విషయాన్ని తనకు చెప్పలేదు అనే సమాధానం చెప్పాడు. అయితే మీ బాబాయ్ కి పరిచయం చేస్తాను రా అంటూ అదే సెట్ లో ఉన్న బాలకృష్ణ దగ్గరకు ఎన్టీఆర్ చేతిని పట్టుకొని పరుచూరి గోపాలకృష్ణ తీసుకువెళ్లి బాలయ్య బాబుతో పరిచయం చేయించి మాట్లాడారట.

అలా ఎన్టీఆర్ బాలకృష్ణను బాబాయ్ మాదిరి కాకుండా, ఒక అభిమానిగా మొట్టమొదటిసారి పాలకొల్లులో కలిశారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.