Salaar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైన కథలను అందిస్తూ రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇకపోతే పరుచూరి ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాలు విడుదలయితే ఆ సినిమాల గురించి విశ్లేషణ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా సలార్ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ప్రభాస్ ఏ సినిమా ద్వారా హిట్ అందుకోలేదు కానీ సలార్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా గురించి పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘిక అంశాలు అన్నీ మేళవించి ప్రశాంత్ సలార్ సినిమా రూపొందించారని వివరించారు.
అయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాకుండా మరి ఏ డైరెక్టర్ అయిన ఈ సినిమాని కనుక చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యదని ఆయన కాబట్టి సినిమా హిట్ అయ్యిందని తెలిపారు. ఇక మొదటి 30 నిమిషాల పాటు ప్రభాస్ కి ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.
స్క్రీన్ ప్లే అద్భుతం..
సినిమాలో కాన్సర్ అనే ప్రాంతాన్ని చరిత్రతో మిక్స్ చేసి చూపించాడు.ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉందని యాక్షన్స్ సన్ని వేషాలు కూడా చాలా అద్భుతంగా చూపించారని గోపాలకృష్ణ సలార్ సినిమా పట్ల తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు రెండవ భాగం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…