Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా కృష్ణా మరణంతో సీనియర్ హీరోల శకం ముగిసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.ఇదిలా ఉండగా కృష్ణ గారితో పనిచేసినటువంటి సెలబ్రిటీలు రచయితలు దర్శకనిర్మాతలు ఆయనతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ కృష్ణ గారి మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన మంచితనాన్ని బయటపెట్టారు.కృష్ణ గారు తనకు అడగకుండానే సహాయం చేశారని ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఈయన తెలిపారు.
బంగారు భూమి సినిమా కోసం తాను నాలుగైదు డైలాగులు రాసానని ఇలా రాసినందుకే తన పేరుని మొదట్లో వేయించుకోమని చెప్పారు. కానీ నేను వద్దని చెప్పాను. ఇక ఈ సినిమాలో పద్మ మనిషిని నమ్ముకుంటే మన నోట్లో మట్టి కొడతాడు.. అదే మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది.ఆ మట్టికి నమస్కారం చేయి అనే డైలాగ్ విన్న తర్వాత కృష్ణ గారు ఎంతో అద్భుతంగా ఉంది ఎవరు రాశారు అని అడిగారు అప్పుడు పి సి రెడ్డి గారు ఆ డైలాగ్ నేను రాసానని కృష్ణ గారికి చెప్పారు.
ఈ డైలాగ్ విన్న అనంతరం నేను ఇండస్ట్రీలో పెద్ద రచయిత అవుతానని అప్పట్లోనే కృష్ణ గారు జోస్యం చెప్పారని పరుచూరి వెల్లడించారు.హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ ఎంతోమందికి సహాయ సహకారాలు చేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ క్రమంలోనే అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో తన ఇంటి నిర్మాణానికి డబ్బు సహాయం చేశారని ఇలా కృష్ణగారు డబ్బు సహాయం చేయడంతోనే ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టానని, అదే మంచితనమే మహేష్ బాబుకు కూడా వచ్చింది అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా కృష్ణ గారిని తలుచుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…