Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా, వ్యాఖ్యాతగా కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఈయన వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికే మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ కావడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.
మొదటి సీజన్ సినీ సెలబ్రిటీలను గెస్ట్లుగా ఆహ్వానించి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అయితే రెండవ సీజన్లో మాత్రం ఎంతో విభిన్నంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం పై అంచనాలు పెంచారు.ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ సురేష్ నటి రాధిక కూడా హాజరు కానున్నారు.కిరణ్ కుమార్ రెడ్డి కేవలం మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా చిన్నప్పటి నుంచి బాలకృష్ణకు ఆప్తమిత్రుడు కావడంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా బాలకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నో విషయాలు ప్రశ్నించడమే కాకుండా దివంగత నాయకుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మనం గొప్ప వ్యక్తులను నాయకులను కోల్పోయాము. అలాంటి గొప్ప వ్యక్తులలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు అంటూ బాలకృష్ణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇలా బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైఎస్సార్ గురించి గొప్పగా చెప్పడంతో వైయస్సార్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయి అనే విషయంపై ఆసక్తి ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…