Tag Archives: pasivadi pranam

Hero Krishna : ‘పసివాడి ప్రాణం’ సినిమా చేయాలనుకున్న కృష్ణ.. ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

Hero Krishna: దక్షిణాది సినీపరిశ్రమ అనగానే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు మద్రాస్ లోని విజయ- వాహిని, జెమినీ స్టూడియోస్ లోనే షూటింగ్ జరుపుకొని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం లాంటి పరిణామాలతో దక్షిణాది రాష్ట్రాలు సొంతగా సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రమైన కేరళ అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించుకుంటుంది. అయినప్పటికి కొత్త కథలతో సినిమాలు నిర్మించి విజయపరంపర కొనసాగిస్తున్నారు.

ఆ క్రమంలో విజయవంతమైన చిత్రాల రీమేక్ హక్కులను టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ కి అమ్ముతున్నారు. 1985 పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ ఫోర్డ్ హీరోగా విట్నెస్ (WITNES) చిత్రం విడుదలయింది. కొత్త కథలు కొరకు చూస్తున్నా మలయాళ కథారచయిత ‘ఫాజిల్’ విట్నెస్ చిత్రాన్ని చూసి ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి మమ్ముట్టి, నదియా హీరో, హీరోయిన్లుగా “పూవిన్ పుతియా పూన్ తెన్నల్” చిత్రాన్ని రూపొందించారు.

మలయాళంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలా ఈ విజయవంతమైన సినిమా కోసం ఇతర సినీ పరిశ్రమ నిర్మాతలు పోటీపడి రీమేక్ హుక్కులను కొనుక్కున్నారు. అనేకమంది తెలుగు నిర్మాతలు పోటీపడగా చివరికి రీమేక్ హక్కులు అల్లు అరవింద్ కు దక్కాయి. ఇది గమనించని విజయబాపినీడు ‘విట్నెస్’ అనే ఇంగ్లీష్ ‌చిత్రాన్ని చూసి… ‘సాక్షి’ టైటిల్ తో ఓ కథను రాసుకున్నారు.

Hero Krishna: పసివాడి ప్రాణం సినిమాలో ముందుగా నటించాల్సిన హీరో కృష్ణ ..ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

బాలనటుడిగా మహేష్ బాబు..

ఆచంట గోపీనాథ్ నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్ అని భావించాడు. ఇందులో బాలనటుడిగా మహేష్ బాబుని అనుకున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభించాలి అన్న నేపథ్యంలో ఇదే కథతో చిరంజీవి సినిమా చేస్తున్నారని తెలియడంతో అలాంటి కథతోనే మరో సినిమా చేయడం మంచిది కాదని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం విరమించుకున్నారు. అలా కృష్ణతో చేయాల్సిన పసివాడి ప్రాణం కాస్తా ఆగిపోయింది.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన”డబుల్ హ్యాట్రిక్” ఇండస్ట్రీ హిట్ మూవీస్.. ఇది సినీ చరిత్రలో ఓ అరుదైన రికార్డ్.!!

1978 మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం… ప్రాణంఖరీదు, మనఊరి పాండవులు, శుభలేఖ, అభిలాష, చాలెంజ్, ఖైదీ, అడవి దొంగ, కొండవీటిరాజా లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకు వెళ్తున్న..

ఆయన సినీ ఖాతాలో 1987 మొదలుకొని 1992 వరకు నిరాటంకంగా ఆరు సంవత్సరాలు ‘డబుల్ హ్యాట్రిక్ ‘ ఇండస్ట్రీహిట్స్ సినీపరిశ్రమకు అందించడం జరిగింది.

1987 గీతా ఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘పసివాడి ప్రాణం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మొదటగా ఈ చిత్రాన్ని మలయాళంలో రూపొందించగా గీతాఆర్ట్స్, రీమేక్ హక్కులు తీసుకొని పసివాడి ప్రాణం చిత్రాన్ని రూపొందించారు. ఇది ఆ సంవత్సరానికి ఇండస్ట్రీహిట్ గా నిలిచింది.

1988 జి.వి.నారాయణ రావు అండ్ ఫ్రెండ్స్ నిర్మాణం, రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో ‘యముడికి మొగుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు. యముని కథతో కూడిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రాజ్ కోటి ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆ సంవత్సరానికి గాను యముడికి మొగుడు ఇండస్ట్రీహిట్ గా నిలిచింది.

1989 గీతాఆర్ట్స్ నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అత్తా అల్లుళ్ళసవాల్, ప్రతి సవాల్ లతో కూడిన చిత్రం కావడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

1990 అశ్వినీదత్ నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “జగదేక వీరుడు అతిలోక సుందరి ” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఇంతకుముందు తీసిన చిత్రాలకు భిన్నంగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ సంవత్సరానికి ఈ చిత్రం బాక్సాఫీస్ ని చెడుగుడు లాడించింది.

1991 మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్ ‘చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ తో మెగాస్టార్ అభిమానులను అలరించారు. బప్పిలహరి సంగీతం ఆనాటి కుర్రకారును కుర్చీలోనే డాన్స్ వేసేలా చేసింది. ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.

1992 దేవి ఫిలిమ్ ప్రొడక్షన్స్ నిర్మాణం,కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఘరానా మొగుడు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించారు. గర్వంతో ఫ్యాక్టరీ యజమానురాలుగా ఉన్న నగ్మాను పెళ్లిచేసుకొని ఆమెకు గుణపాఠం చెప్పే పాత్రలో చిరంజీవి నటించారు. ఎం.ఎం.కీరవాణి అందించిన పాటలు ప్రేక్షకులను నిలకడగా కూర్చోకుండా చేశాయి. ఈ సినిమా ఆ సంవత్సరానికి ఇండస్ట్రీహిట్ గా నిలిచింది. ఈ విధంగా ఆర్డర్ తప్పకుండా మెగాస్టార్ నటించిన 6 చిత్రాలు ఇండస్ట్రీహిట్ గా నిలవడం సినీ చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోయింది.

Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ ‘పసివాడి ప్రాణం’ చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!

దక్షిణాది సినీపరిశ్రమ అనగానే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు మద్రాస్ లోని విజయ- వాహిని, జెమినీ స్టూడియోస్ లోనే షూటింగ్ జరుపుకొని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం లాంటి పరిణామాలతో దక్షిణాది రాష్ట్రాలు సొంతగా సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రమైన కేరళ అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించుకుంటుంది. అయినప్పటికి కొత్త కథలతో సినిమాలు నిర్మించి విజయపరంపర కొనసాగిస్తున్నారు.

Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ ‘పసివాడి ప్రాణం’ చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!

ఆ క్రమంలో విజయవంతమైన చిత్రాల రీమేక్ హక్కులను టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ కి అమ్ముతున్నారు. 1985 పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ ఫోర్డ్ హీరోగా విట్నెస్ (WITNES) చిత్రం విడుదలయింది. కొత్త కథలు కొరకు చూస్తున్నా మలయాళ కథారచయిత ‘ఫాజిల్’ విట్నెస్ చిత్రాన్ని చూసి ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి మమ్ముట్టి, నదియా హీరో, హీరోయిన్లుగా “పూవిన్ పుతియా పూన్ తెన్నల్” చిత్రాన్ని రూపొందించారు. మలయాళంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలా ఈ విజయవంతమైన సినిమా కోసం ఇతర సినీ పరిశ్రమ నిర్మాతలు పోటీపడి రీమేక్ హుక్కులను కొనుక్కున్నారు. అనేకమంది తెలుగు నిర్మాతలు పోటీపడగా చివరికి రీమేక్ హక్కులు అల్లు అరవింద్ కు దక్కాయి.

Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ ‘పసివాడి ప్రాణం’ చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!

ఇది గమనించని విజయబాపినీడు ‘విట్నెస్’ అనే ఇంగ్లీష్ ‌చిత్రాన్ని చూసి… ‘సాక్షి’ టైటిల్ తో ఓ కథను రాసుకున్నారు. ఆ కథ హీరో కృష్ణకు నచ్చడంతో.. బాలనటుడిగా మహేష్ బాబుని, హీరోయిన్ గా శ్రీదేవిని అనుకొని అట్లూరి రాధాకృష్ణ నిర్మాణంలో సినిమా ప్రారంభించారు. కానీ గీతాఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరో,హీరోయిన్లుగా ఇదివరకే పసివాడి ప్రాణం చిత్రం ఆరంభమై షూటింగ్ జరుపుకుంటుందని తెలుసుకుని హీరో కృష్ణ సినిమాని మధ్యలోనే నిలిపివేసి కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తీసుకుని ‘మహారాజశ్రీ మాయగాడు’ చిత్రం ప్రారంభించారు. ఇక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం ఘన విజయం సాధించింది.