Tag Archives: raja ravindra

Shobhan Babu: స్టార్ హీరో శోభన్ బాబు పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి ఇదే కారణమా?

Shobhan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న వారిలో నటుడు శోభన్ బాబు ఒకరు.తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శోభన్ బాబు కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన తన వారసులుగా ఇండస్ట్రీకి తన కొడుకులను పరిచయం మాత్రం చేయలేకపోయారు.ఇలా తన పిల్లలకి నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ శోభన్ బాబు మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెట్టారు. ఇలా శోభన్ బాబు తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెట్టడానికి గల కారణం ఏంటి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఈ క్రమంలోనే నటుడు రాజా రవీంద్రకు సైతం ఇదే ఆలోచన రావడంతో ఈయన శోభన్ బాబు గారిని ఇదే ప్రశ్న అడిగారట.అందుకు శోభన్ బాబు సమాధానం చెబుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాలను అందుకోవడం కోసం ఎన్నో అవమానాలను, కష్టాలను పడ్డాను.ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఇండస్ట్రీలో తాను ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని అలాంటి ఒత్తిడి అవమానాలు కష్టాలు తన పిల్లలకు వద్దన్న ఉద్దేశంతోనే వారిని ఇండస్ట్రీకి దూరం పెట్టానని శోభన్ బాబు తెలిపారట.

Shobhan Babu: భూమిపై ఇన్వెస్ట్ చేసిన శోభన్ బాబు…

ఇక శోభన్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ అందరిలాగా సినిమాలలోని ఇన్వెస్ట్ చేయకుండా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఇలా అప్పట్లో శోభన్ బాబు కొన్న భూములు విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్ల విలువ చేయడం విశేషం. ఇక శోభన్ బాబు కుమారులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వ్యాపార రంగంలో మంచిగా స్థిరపడ్డారని చెప్పాలి.

Raja Ravindra: ఆంటీ అంటూ వేదికపైనే శ్యామల పరువు తీసిన నటుడు రాజా రవీందర్.. శ్యామల రియాక్షన్ ఇదే!

Raja Ravindra: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజా రవీంద్ర గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పలువురు యంగ్ హీరోలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చిన్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలోనే నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన తగ్గేదే అనే సినిమాకి కూడా రాజా రవీంద్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.శ్రీనివాసరాజు దర్శకుడిగా తెరికెక్కిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రాజా రవీందర్ మాట్లాడుతూ చిత్ర బృందంపై ప్రశంసల కురిపించారు. అదేవిధంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ గురించి కూడా ఎంతో గొప్పగా వర్ణిస్తూ… ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి శ్యామల యాంకర్ గా వ్యవహరించారు.

Raja Ravindra: మీరు తాతయ్య అయినట్టే..


ఈ విధంగా నటుడు రాజా రవీందర్ టెక్నీషియన్లు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరికి శ్యామల ఆంటీకి కూడా ధన్యవాదాలు అంటూ ఆమె పరువు తీశారు. ఇలా రాజా రవీందర్ శ్యామలను ఆంటీ అనడంతో వెంటనే శ్యామల ఏంటి నేను ఆంటీనా.. నేను ఆంటీ అయితే మీరు తాతయ్య అవుతారు అంటూ శ్యామల తనదైన శైలిలో నటుడు రాజా రవీందర్ పై రివర్స్ పంచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Raja Ravindra : సెట్స్ లో శ్రీముఖి అలా ఉంటుంది, మా మధ్య అంత రాపో లేదు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినా రాజా రవీంద్ర…!

Raja Ravindra : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన రాజా రవీంద్ర చాలా మంది హీరోలకు డేట్స్ కూడా చూస్తారు. వెంకటేష్, రాజ్ తరుణ్, జయసుధ వంటి వారికి సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేస్తుంటారు రాజా రవీంద్ర. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటిస్తున్న రాజా ఆ సినిమాతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, భరణి, మనో కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో తనతో పాటు నటించిన శ్రీముఖి గురించి రాజా రవీంద్ర చాలా బబ్లీగా ఉండే అమ్మాయి కానీ సినిమాలో తన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని, తనను సెట్స్ లో ఆటపట్టించేంత చనువు లేదని మనో తో తాను ఎక్కువ షో లు చేయడం వల్ల తనతో చనువుగా ఉంటుందని నాతో చాలా తక్కువగా మాట్లాడుతుందంటూ వివరించారు.

హీరో అవ్వాలని ఇండస్ట్రీ కి రాలేదని హీరో అయితే చాలా టెన్షన్ పడాలని ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా హీరో మీద భాద్యత ఎక్కువ ఉంటుందని 5 కోట్లు తీసుకున్నా, 500 కోట్లు తీసుకున్నా ఒక సినిమా విడుదల అప్పుడు హీరో చాలా ఒత్తిడి ఎదుర్కొంటాడంటూ శోభన్ బాబు గారు తనతో అన్న మాటలను చెప్పారు. అందరు హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. మీరేందుకు మీ కొడుకుని సినిమాల్లోకి రానివ్వలేదు అని అడుగగా నేను శోభన్ బాబుగా ప్రతి సినిమాకు ఎంతో టెన్షన్ పడతాను. ఆ టెన్షన్, ఒత్తిడి నా కొడుకు ఎందుకు భరించాలి.

కొన్ని వేల కోట్లు సంపాదించినా ఒక సినిమా విడుదల అప్పుడు ఒక హీరో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అలాంటి టెన్షన్ నా కొడుకుకి ఇవ్వాలనుకోవడం లేదని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇక హీరోయిన్ల డేట్స్ ఎందుకు చూడడం లేదని అడుగగా ఒక హీరో ఒక సమయంలో ఒక సినిమానే తీస్తాడు. కానీ హీరోయిన్స్ అలా కాదు వివిధ భాషలలో ఏక కాలంలో సినిమాలు తీస్తుంటారు. ఒక్కోసారి అలా డేట్స్ క్లాష్ అవుతుంటాయి. అపుడు వాళ్ళ మేనేజర్స్ పడే టెన్షన్ చాలా సార్లు చూసాను అందుకే హీరోయిన్స్ జోలికి వెళ్లనని చెప్పారు.

Raja Ravindra : “దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు” అంటూ షూటింగ్ లోనే చిరంజీవి తిట్టారు : రాజా రవీంద్ర..!

Raja Ravindra about megastar : తెలుగు ఇండస్ట్రీ లో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాజా రవీంద్ర. ఎన్నో సినిమాల్లో నెగెటివ్ పాత్రలు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసారు. పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయి సినిమా లలో మంచి అవకాశాలు దక్కించుకుని గుర్తింపు పొందిన రాజా రవితేజ వంటి హీరోలకు డేట్స్ మేనేజ్ చేయడం కూడా చేసేవారట.

మెగా స్టార్ స్ఫూర్తి….

సినిమాల్లోకి రావడానికి చాలా మందికి మెగా స్టార్ చిరంజీవి స్ఫూర్తి. అలాగే రాజా రవీంద్ర గారికి కూడా సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారు స్ఫూర్తి అనీ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన స్వయంకృషి తో కష్టపడి ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తినింపారాని చెబుతుంటారు.

అలా చూస్తూ ఉండిపోతా…..

మెగాస్టార్ తో కలిసి ఒకే సినిమాలో నటించేటపుడు ఆయనను చూస్తూ ఉండిపోయేవాడినని చెప్పారు రాజా రవీంద్ర.ఇక మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో రాజా నటించారు ఈ సినిమా షూటింగ్ సందర్బంగా జరిగిన ఒక సంఘటన ను ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పారు .అన్నయ్య నాకెంతో క్లోజ్‌.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను.

ఆచార్య షూటింగ్‌లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తూ ఉన్నాను. దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుందని చెప్పాను. దానికాయన ఖర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది కానీ, నాకు బాగుంటుంది’ అని చెప్పాడు రాజా రవీంద్ర. చిరంజీవి గారిలో చాలా మెచూరిటీ ఉంటుందని ఆయన ఎదుటివారిని ఇట్టే పసిగట్టగలరని చెప్పారు రాజా.

రవితేజ కాళ్ళు కడిగా.. ఎవడో ఎదో చెప్పాడని నాతొ మాట్లాడటం మానేసాడు.. : రాజా రవీంద్ర

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరని చెప్పవచ్చు. రవితేజ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత హీరోగా సినీ అవకాశాలను అంది పుచ్చుకుంటూ ప్రస్తుతం మాస్ మహారాజ్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

రవితేజతో పాటు ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చి అతనితో పాటు ప్రయాణం చేశారు. ఈ విధంగా రవితేజతో కలిసి రఘు కుంచే, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, రాజా రవీంద్ర వంటి నటులు కూడా ఉన్నారు. రవితేజ ప్రతి కష్టంలోనూ వీరు కూడా తన వెంటే ఉండి తన కష్టాలను పంచుకున్నారు.తాజాగా నటుడు రాజా రవీంద్ర క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ రవితేజ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రవితేజతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని, రవితేజ తనని ఎప్పుడు మామ అని పిలుస్తుంటారు అని చెప్పారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ ఒక సందర్భంలో రవితేజ కాళ్లు కూడా కడిగానని రాజారవీంద్ర పేర్కొన్నారు. అసలు రవితేజ కాళ్లు కడగడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

రవితేజ పెళ్లి సమయంలో తనకు కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన అత్తమామలు అనారోగ్య సమస్య కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే రాజారవీంద్రని రవితేజ మామ అని పిలుస్తున్న కారణం చేత పెళ్లి సమయంలో రవితేజ కాళ్ళు కూడా కడిగానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర రవితేజకు తనకి మధ్య ఉన్న బంధం గురించి వెల్లడించారు. ఇక స్టార్ హీరోగా రవితేజ గుర్తింపు పొందిన సమయంలో తనని మేనేజర్ గా చేసి తన డేట్స్ అన్ని చూసుకునే వ్యవహారాలను తనకు అప్పగించారని ఈ సందర్భంగా రాజ రవీంద్ర రవితేజ గురించి తెలియజేశారు.

అదే సమయంలో రవితేజ తో వచ్చిన క్లాష్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి ఎవరో నా గురించి ఏవేవో చెప్పడం మొదలు పెట్టారు. ఆ తరువాత మాట్లాడటం మానేసాడు. కొద్దిరోజులు భరించిన రవితేజ ఆ తరువాత “మనిద్దరం హీరో, మేనేజర్ కంటే ఫ్రెండ్స్ గా ఉండిపోవడమే బెటర్ ఏమోరా” అని అన్నాడు.. అయన అలా అనే సరికి నేను ఇంకేం మాట్లాడలేదు.. “ఓకే రా ఆల్ ది బెస్ట్” అని చెప్పేసి వచ్చేసా.. ఇప్పటికీ ఫ్రెండ్ గా కలుస్తూనే ఉంటాం. అని చెప్పారు రాజ రవీంద్ర.

”రోజ్ విల్లా” మూవీ రివ్యూ

రోజ్ విల్లా పేరు వింటేనే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఇందులో ఎన్నో సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. క‌న్న‌డ దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి న‌టించిన సినిమా రోజ్‌విల్లా. రాజా ర‌వీంద్ర కూడా ఇందులో న‌టించారు. హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత అచ్యుత్ రామారావు పి, చిత్ర మందిర్ స్టూడియోస్ బేన‌ర్‌పై నిర్మించారు. నేడు (అక్టోబర్ 1) విడుదలైన సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.

కథ:
యువ జంట. డాక్ట‌ర్ ర‌వి (దీక్షిత్ సెట్టి), శ్వేత (శ్వేత వ‌ర్మ) తాము ఎంతో ఇష్ట పడిన ప్రాంతానికి కారులో ప్రయాణం చేస్తూ ఆ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా వారి కారు ఏదో సమస్య వస్తుంది. అయితే అది నక్సల్స్ ప్రాంతం కావడంతో పోలీసులు వచ్చి వారిని ఒక సురక్షితమైన గ్రామానికి తరలిస్తారు. ఈ క్రమంలో అక్కడ ఒక హోటల్ లో భోజనం చేస్తుంటారు మిల‌ట్రీ రిటైర్ అయిన సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) త‌న భార్య హెలెన్‌తో (అర్చ‌నా కుమార్‌) తో ఆ రెస్టారెంట్ లోనే భోజనం చేస్తుంటారు. అయితే సోలమాన్ కి పొలమారడంతో డాక్టర్ రవి అతనికి చిన్న చిన్న చిట్కాలను చెబుతూ ఆరోగ్యం కుదుటపడి ఎలా చేస్తాడు. ఈ క్రమంలోనే ఈ కృతజ్ఞతతో సోలామాన్ తన ఇంట్లో జరిగే ఫంక్షన్ కు వీరిని ఆహ్వానిస్తాడు.ఆ ఇంటికి వెళ్లిన ఈ జంటకు అక్కడ వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పటినుంచి విపరీతమైన ఆందోళనలు అసలు అక్కడ ఎందుకలా జరిగింది? ఏంటి? అనేది ఎంతో ఆసక్తికరంగా మారనుంది.

విశ్లేషణ:
ఒక సాధారణ కథను తీసుకొని ఎంతో భావోద్వేగమైన త్రిల్లింగ్ ఎమోషనల్ కథను తెరకెక్కించారు దర్శకుడు హేమంత్ఎంతో ఆసక్తికరమైన కథనంతో మొదలయ్యి భావోద్వేగమైన డైలాగులతో సినిమా నడుస్తుంది. ఇక వీరిలో రాజా రవీంద్ర అర్చన నటన అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఎన్నో కీలక మలుపులతో ఎంతో ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా ఈ సినిమా సాగనుంది.

సాంకేతికత:
త్రీల్లింగ్ సస్పెన్షన్ చిత్రానికి బొబ్బిలి సురేష్ సంగీతం అద్భుతంగా వచ్చింది. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత హైలైట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ అంజి సన్నివేశాలను వాస్తవికంగా తెరకెక్కించారు. శివ ఎడిటింగ్ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.పరిమిత బడ్జెట్ తో అపరిమిత చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. కేవలం కొడుకు కోసం తల్లిదండ్రులు పడే తపన ఎంతో ఎమోషనల్ గా ఉంది. ఎక్కడ విసుగు తెప్పించకుండా సస్పెన్స్ చివరిలో చెప్పి అందరికీ సినిమాపై ఆసక్తిని కల్పించారు.

రేటింగ్ 2.75/5

సునీల్ నన్ను మేనేజర్ గా తీసేయడానికి కారణం అదే: రాజా రవీంద్ర

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాజారవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలలో పలు పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో రాజా రవీంద్రకు హీరో రవితేజకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ తనని ఎంతో అభిమానంగా మామ అంటూ పిలిచేవారని, రవితేజ పెళ్లి సమయంలో అతని కాళ్లు కడిగి కన్యాదానం చేశానని రవీంద్ర ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

అయితే రవితేజతో ఈ మధ్యకాలంలో కొన్ని విభేదాలు రావడం వల్ల అతనితో మాటలు లేవని విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే ఎంతో మంది హీరోలకు మేనేజర్ గా రాజా రవీంద్ర వ్యవహరించారు.ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాజారవీంద్ర తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎంతో మంది హీరోలు మేనేజర్ లను తీసేసి ఉంటారని తాజాగా నన్ను సునీల్ తన మేనేజర్ గా తొలగించారని విషయాన్ని తెలిపారు.అసలు సునీల్ మేనేజర్ గా తీసేయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ప్రశ్నించగా అది సునీల్ ను అడగాలి అంటూ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ… సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు

సాధారణంగా తనకి ఏదైనా క్లాష్ వస్తే తనకు పర్సనల్ గా వెళ్లి ఇది చేస్తే బెటర్ గా ఉంటుంది అంటూ సలహాలు ఇచ్చే వాన్నే ఒకసారి వాటి గురించి నేను మాట్లాడతాను అంటూ తనతో మాట్లాడటం మరిచిపోయే వాణ్ని. ప్రస్తుతం హీరోస్ నుంచి కమెడియన్ గా చేస్తున్న సునీల్ కి కొంచెం పర్సనల్ అటెన్షన్ ఎక్కువగా ఉండాలని ఫీలయ్యాడు అది నా దగ్గర నుంచి లేకపోయేసరికి మేనేజర్ గా తీసేసారని నేను భావిస్తున్నాను. కానీ సునీల్ ఇప్పటి వరకు సరైన కారణం చెప్పలేదు అని ఓ ఇంటర్వ్యూలో రాజారవీంద్ర తెలియజేశారు.

రవితేజ కాళ్లు కడిగిన సీనియర్ నటుడు.. ఎందుకో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరని చెప్పవచ్చు. రవితేజ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత హీరోగా సినీ అవకాశాలను అంది పుచ్చుకుంటూ ప్రస్తుతం మాస్ మహారాజ్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

రవితేజతో పాటు ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చి అతనితో పాటు ప్రయాణం చేశారు. ఈ విధంగా రవితేజతో కలిసి రఘు కుంచే, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, రాజా రవీంద్ర వంటి నటులు కూడా ఉన్నారు. రవితేజ ప్రతి కష్టంలోనూ వీరు కూడా తన వెంటే ఉండి తన కష్టాలను పంచుకున్నారు.తాజాగా నటుడు రాజా రవీంద్ర క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ రవితేజ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రవితేజతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని, రవితేజ తనని ఎప్పుడు మామ అని పిలుస్తుంటారు అని చెప్పారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ ఒక సందర్భంలో రవితేజ కాళ్లు కూడా కడిగానని రాజారవీంద్ర పేర్కొన్నారు. అసలు రవితేజ కాళ్లు కడగడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

రవితేజ పెళ్లి సమయంలో తనకు కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన అత్తమామలు అనారోగ్య సమస్య కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే రాజారవీంద్రని రవితేజ మామ అని పిలుస్తున్న కారణం చేత పెళ్లి సమయంలో రవితేజ కాళ్ళు కూడా కడిగానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర రవితేజకు తనకి మధ్య ఉన్న బంధం గురించి వెల్లడించారు. ఇక స్టార్ హీరోగా రవితేజ గుర్తింపు పొందిన సమయంలో తనని మేనేజర్ గా చేసి తన డేట్స్ అన్ని చూసుకునే వ్యవహారాలను తనకు అప్పగించారని ఈ సందర్భంగా రాజ రవీంద్ర రవితేజ గురించి తెలియజేశారు.

అదే సమయంలో రవితేజ తో వచ్చిన క్లాష్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి ఎవరో నా గురించి ఏవేవో చెప్పడం మొదలు పెట్టారు. కొద్దిరోజులు భరించిన రవితేజ ఆ తరువాత “మనిద్దరం హీరో, మేనేజర్ కంటే ఫ్రెండ్స్ గా ఉండిపోవడమే బెటర్ ఏమోరా” అని అన్నాడు.. అయన అలా అనే సరికి నేను ఇంకేం మాట్లాడలేదు.. “ఓకే రా ఆల్ ది బెస్ట్” అని చెప్పేసి వచ్చేసా.. ఇప్పటికీ ఫ్రెండ్ గా కలుస్తూనే ఉంటాం. అని చెప్పారు రాజ రవీంద్ర.

చిరంజీవి రోజుకు ఎన్ని లక్షలు సాయం కోసం వేచ్చిస్తారో తెలుసా?

మెగస్టార్ చిరంజీవి గురించి పాజిటీవ్ గా చెప్పేవాళ్లు ఉంటారు తప్ప నెగెటివ్ గా చెప్పేవారు చాలా తక్కువ మంది. ఎందుకంటే అతడు చేస్తున్న సేవలే అతడి మంచితనానికి నిదర్శనం. అయితే మెగస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శం కూడా. అయితే ఇటీవల విడుదలైన క్రేజీ అంకుల్స్ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజా రవీంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిరంజీవి గురించి చెప్పారు.

సినీ పరిశ్రమలోనే కాదు బయట వ్యక్తి కూడా కష్టాల్లో ఉన్నాడంటే ముందు ఉండే వారిలో చిరంజీవి ఒకరు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టినా చిరంజీవి ఎంతో సింపుల్ గా ఉంటారని.. సహాయం చేసి కూడా ఎవరికీ చెప్పవద్దనే చెప్పే సహాయ గుణం గలవారని ప్రశంసింస్తూ.. చిరంజీవి చేసిన సేవల గురించి రవీంద్ర చెప్పారు.

కోవిడ్ టైంలో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. తన సొంత ఖర్చుతో వ్యాక్సిన్ కొని వేయించాడన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలిచాయన్నాడు. హేమ డెలివరీ సమయంలో ఎంతో బ్లడ్ కావాల్సి వచ్చిందని.. మెగస్టార్ ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ సహాయం చేసిందని ఆయన గుర్తు చేశాడు. అతడు కేవలం బ్లడ్ బ్యాంకు కోసమే రూ.20 లక్షల వరకు ఖర్చు పెడతారని అన్నారు.

తొమ్మిది సంవత్సరాలు రాజకీయంలో ఉండి మళ్లీ సినిమాలోకి రావడానికి తన బాడీని మార్చుకోవడం కోసం ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశాడని అన్నారు. అంత డెడికేషన్ ఉన్న మనిషిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు. రాజా రవీంద్ర చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలోలో వైరల్ గా మారాయి.

‘క్రేజీ అంకుల్స్’ తో రోమాన్స్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి.. త్వరలో..

యాంకర్ గా శ్రీముఖి అతి తక్కువ కాలంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ కనపడుతూ.. తమ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతే కాకుండా తన యూట్యూబ్ చానల్ లో ప్రతీ రోజు ఎదో ఒక వీడియో అప్ లోడ్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.
అయితే శ్రీముఖి ఓ వైపు టీవీ యాంకర్‌గానూ.. మరోవైపు సినీ నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ముఖ్యంగా ఆమెకు పటాస్ షో ద్వారా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. యాంకరింగ్ లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి.. అటు సినిమాల్లోనూ చిన్నా చితక పాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించారు. దాని పేరు క్రేజీ అంకుల్స్. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్నిగ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్, గుడ్ సినిమా గ్రూప్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల ఈ సనిమా ట్రైలర్ విడుదలయ్యింది. దీంతో క్రేజీ అంకుల్స్ పై ప్రతీ ఒక్కరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా టైటిల్ లిరిక‌ల్ సాంగ్‌ని ఇంతకు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. రఘు కుంచే సంగీతం అందించగా లిప్సిక గానం చేసిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.

ఈ పాట ఇప్పటికే 50 లక్షల వ్యూస్ తో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాను మేలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగస్టు 19న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు నిర్మాత శ్రేయాస్ శ్రీను చెప్పారు. అయితే దీనికి సంబంధించి విడుదల తేదీని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.