Tag Archives: raju

Ashu Reddy: తనకు ముద్దులు పెడుతూ రెచ్చిపోయిన ఆశు రెడ్డి.. ఇదేం దరిద్రం అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్!

Ashu Reddy: సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిపోయారు అలా సెలబ్రిటీలుగా మారిన వారిలో అశు రెడ్డి ఒకరు. ఈమె డబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంత ఫేమస్ అయ్యారు.ఇలా ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఈమెను జూనియర్ సమంత అంటూ కామెంట్లు చేయడంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది. ఇలా బుల్లితెరపై రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అశు రెడ్డి సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటిస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇక ఈమె ధరించే వింత డ్రస్సుల వల్ల కూడా కొన్నిసార్లు భారీగా నేటిజన్ ల ట్రోలింగ్ గురవుతూ ఉంటుంది.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈమె తన రాజు గురించి చెప్పిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా తన పెట్ రాజుకు బంగారం వేసి అందంగా ముస్తాబు చేసింది.ఇలా తన పెట్ ను బంగార్రాజుగా మారిపోయిన తన పెట్ తో ఈమె ముద్దులు పెడుతూ ఒక రీల్ చేశారు.

Ashu Reddy: పెట్ పై ప్రేమను కురిపించిన ఆశు రెడ్డి…

ఈ క్రమంలోనే ఆ వీడియోని షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీటిని షేర్ చేస్తూ ఇవి మనుషుల్లాగా కాదు.. వీటికి ఒకసారి మనసిస్తే బ్రేక్ చేయవు అంటూ తన పెట్ కి ముద్దులు పెడుతున్న ఒక ఫోటోలను షేర్ చేయడంతో ఇవి చూసిన నెటిన్లను ఇదేం దరిద్రం అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆశు రెడ్డి ఏదో ఒక న్యూస్ ద్వారా నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు.

సైదాబాద్ నిందితుడు రాజు చేతి పై ఉన్న మౌనిక పేరు వెనుక ఉన్న రహస్యం ఇదే..!

సాధారణంగా మనం మన చేతి పై లేదా మన శరీరంపై మనకు ఎంతో ప్రియమైన వారి పేర్లను టాటూలు వేయించుకోవడం చూస్తున్నాము. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9వ తేదీన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి చరిత్రపై రాజు అనే యువకుడు చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై చంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే చనిపోయిన చిన్నారికి న్యాయం జరగాలంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తాయి.

నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిన్న ఉదయం రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం నిందితుడు రాజుదేనని పోలీసులు తన చేతి పై ఉన్న మౌనిక అనే టాటూ ఆధారంగా గుర్తించారు. మరి ఈ మౌనిక ఎవరు? ఇలా రెండు చేతులపై మౌనిక అనే పేరును ఎందుకు రాయించుకున్నారు అనే విషయానికి వస్తే..

నిందితుడు రాజు భార్య పేరు మౌనిక. పెళ్లి తర్వాత రాజు నిత్యం తాగొచ్చి తన భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండడంతో మౌనిక నిందితుడు రాజునుంచి వెళ్ళిపోయి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురంలోని పుట్టింట్లోనే నివసిస్తోంది. ఈ విధంగా వీరు పెళ్లి అయిన సమయంలో తన భార్య పేరును రాజు చేతి పై టాటూ వేయించుకున్నారు. ఇలాతన భార్య తన తో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయి రాకపోవడంతో ఆ రాజు తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నట్లు కొందరు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన పేరును కూడా మౌనిక గా మార్చి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై తన భార్య మౌనిక మాట్లాడుతూ తన భర్త తాగుబోతు అన్న మాట నిజమే కానీ ఈ విధంగా హత్యాచారం చేసే అంత దుర్మార్గుడు కాదని, తన భర్త రెండోపెళ్లి చేసుకోలేదని,తన భర్తను పోలీసులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తన భార్య మౌనిక వెల్లడించారు.

మాకు సెలవులు ఇవ్వండి.. ఆ దుర్మార్గుడిని పట్టుకుంటాం..

సైదాబాద్ లో జరిగిన అత్యాచార, హత్య ఘటనపై ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు అందజేస్తామని పోలీసులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని పై ఎత్తులు వేసినా ఆ నిందితుడు మాత్రం కనిపించలేదు. అందరి డిమాండ్ ఇప్పుడు ఒక్కటే.. నిందితుడిని పట్టుకొని కఠినమైన శిక్షను అమలు చేయాలని.

అందులో సామాన్యులు కూడా భాగస్వాములవుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే చాలామంది దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండంటే.. తమకు సెలవులు కావాలంటూ తమ కంపెనీ బాస్ లను అడుగుతున్నారు. మాకు ఒక వారంరోజులు సెలువులు ఇవ్వండి ఆ దుర్మార్గుడు రాజుని పట్టుకొస్తామంటూ అర్జీలు పెడుతున్నారంట.

పోలీసులు అనౌన్స్ చేసిన ఆ రివార్డు కోసం కాదంటూ.. ఆ ఘటన విన్న మాకు రక్తం మరిగిపోతుందని.. అలాంటి నీచులు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేదంటూ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరు తయారు కాకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్షలు అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.

మాకు ఆ నీచుడిని వెతికి పట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. దానికి తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తులు పెడుతున్నట్లు సమాచారం. బాధిత కుటంబసభ్యులను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు.. సీని ప్రముఖులు కూడా అక్కడికి క్యూ కడుతున్నారు. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తమ వంత భాగస్వాములు అవుతామంటూ పేర్కొంటున్నారు.

నిందితుడిని పట్టించిన వారికి నజరానా ప్రకటించిన ఆర్పీ పట్నాయక్.. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో పాటు..

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ లో చిన్నారి చైత్ర అత్యాచారం, హత్య కేసు ఘటన పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. నిందితుడిని పట్టిస్తే ఇప్పటికే ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డును ప్రకటించగా.. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా రూ.10 లక్షలతో పాటు రూ.50 వేలు నజరానాగా ఇస్తానని చెప్పాడు. ఈ ఘటనపై ఆర్పీ పట్నాక్ తీవ్రంగా స్పందించారు.

ఇటువంటి ఘటనలో నిందితులకు వెంటనే శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. దానికి సంబంధించి అతడు పోలీసులు విడుదల చేసిన అతడి ఫొటో , ఆనవాళ్లను ట్విట్లర్ లో ట్యాగ్ చేస్తూ ఇలా అన్నాడు ‘‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డు ప్రకటించారు.

నా వంతుగా ఆ పట్టించిన వారికి రూ.50 వేలు ఇస్తాను. కానీ ఇతను దొరకాలి.. పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు.. కానీ చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఈ నేరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.

అయితే పోలీసులు ఎంత పటిష్టంగా గాలిస్తున్నారో.. నిందితుడు రాజు కూడా అంతే తెలివిగా వారి నుంచి తప్పించుకుంటున్నాడు. ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా డీల్ చేసి దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థగా తెలంగాణ పోలీసులు పేరు తెచ్చుకున్నారు. అంతటి పేరున్న పోలీసులకు సైతం ఈ నిందితుడు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా.. వైఎస్ షర్మిల

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆరేళ్ల చిన్నారి చైత్రను రాజు అనే దుండగుడు ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటు సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రతీ ఒక్కరు గాలిస్తున్నారు.

ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ పోలీసులు రూ.10 లక్షలు రివార్డు కూడా ఇస్తానని ప్రకటించారు. దానికి సంబంధించి నిందితుడి ఫొటో, ఆనవాళ్లను కూడా షేర్ చేశారు. ఇప్పటికే అతడి ఫొటో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, మీడియాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిపోయింది. కానీ అతడి ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. అయితే దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.

వాళ్ల కుటుంబసభ్యులను ఆమె కలిసి ఓదార్చారు. ఆ చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతనాని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. మరోవైపు బాధిత కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వెచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు..

ఇంత పెద్ద ఘటన జరిగినా వాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఈ ప్రాంతమంతా దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ రాకపోవడం దురదృష్టకరం అని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేసీఆర్ నోరు విప్పి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఫుల్ గా మద్యం సేవించారు.. పామును కసకస నమిలేశారు.. ఎక్కడంటే..

మందుబాబులు మందు కొట్టారంటే.. వాళ్ల వీరంగం మామూలుగా ఉండదు. ఎక్కడ లేని ధైర్యం కూడకట్టుకొని ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు నోటి నుంచి ఏది వస్తే అది మాట్లాడుతారు. ఇలా ఓ ఇద్దరు యువకులు ఫుల్ గా మద్యం సేవించి .. ఓ పామును వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎవరికైనా పాములు అంటే భయపడతారు. ఓ ప్రదేశంలో పాము ఉందంటే.. మరుసటి రోజు అటు వెళ్లడానికి కూడా సాహసించం. ఛత్తీస్‌గఢ్‌లో కోర్భాలో రాజు, హితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. ఓ రోజు అతిగా మద్యం తాగారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడ ఓ పాము చనిపోయి.. కాలిన శరీరంతో కనిపించింది. అయితే మద్యం తాగిన వాళ్లు.. ఆ పాము బతికే ఉందనుకొని.. ఎవరి ఇళ్లల్లోకైనా వెళ్తే.. ప్రమాదం ఉంటుందని ఎకంగా ఇద్దరు కలిసి దానిని.. ముక్కలు ముక్కలు చేసి తినేశారు.

కొద్ది సేపటి తర్వాత కడుపులో తిప్పడం.. తల తిరగడం వంటివి చేశాయి. దీంతో వాళ్ల మత్తు అంతా దిగడమే కాకుండా.. తిన్నదంతా అక్కడే కక్కేశారు. ఆ పాము కనిపించిన ప్రదేశంలో చివరకు సృహ కోలిపోయి పడిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు వాళ్లను గమనించి .. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు, హితేంద్ర చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకు ఎలాంటి నష్టం లేదంటూ వైద్యులు తెలిపారు.

హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన అక్సా ఖాన్.. లిమిట్స్ లో ఉండాలంటూ..!

బుల్లితెరపై ఎన్ని డ్యాన్స్ షోలు ప్రసారమతువున్నా ఈటీవీ ఛానెల్ లో ప్రసారమెయ్యే ఢీ డ్యాన్స్ షో ప్రత్యేకమనే చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి దేశంలోని డ్యాన్సర్లతో కొత్త తరహా డ్యాన్సులు చేయిస్తూ ఈ షో ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న డీ ఛాంపియన్స్ షోలో రష్మి, సుధీర్ ఒక టీంగా కొందరు డ్యాన్సర్లతో హైపర్ ఆది, వర్షిణి మరో టీంగా మరి కొందరు ‘డ్యాన్సర్లతో ఉన్నారు.

డీ ఛాంపియన్స్ షో సెమీఫైనల్స్ ప్రస్తుతం ప్రసారమవుతుండగా హైపర్ ఆదికి అక్సా ఖాన్ వార్నింగ్ ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ షోలో అక్సాఖాన్, పండు ఇప్పటికే ఎలిమినేట్ కాగా పండు ఎలిమినేట్ కావడం ఢీ షో ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు డ్యాన్సర్ గా అందరికీ సుపరిచితమైనా నాదీ నక్కిలీసు గొలుసు పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు.

అలాంటి కంటెస్టెంట్ పండు ఎలిమినేట్ కావడం వెనుక ఏదో జరిగిందని పండు ఫ్యాన్స్ తో పాటు కొందరు నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సెమీఫైనల్ లో రాజు ఎలిమినేట్ కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజుకు ఎలిమినేట్ అయిన అక్సా ఖాన్ కూడా మద్దతు ఇస్తోంది. సుడిగాలి సుధీర్ తో పాటు అతని ఫ్యాన్స్ కూడా రాజుకు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది.

రాజు వేరే టీం అయినప్పటికీ అతనికి మాత్రమే ఢీ ఛాంపియన్స్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని.. రాజు విషయంలో హైపర్ ఆది జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని అక్సా ఖాన్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అక్సా ఖాన్ అలా చెప్పడంతో ఆది కూడా సైలెంట్ గా ఉన్నారని సమాచారం. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.