సైదాబాద్ లో జరిగిన అత్యాచార, హత్య ఘటనపై ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు అందజేస్తామని పోలీసులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని పై ఎత్తులు వేసినా ఆ నిందితుడు మాత్రం కనిపించలేదు. అందరి డిమాండ్ ఇప్పుడు ఒక్కటే.. నిందితుడిని పట్టుకొని కఠినమైన శిక్షను అమలు చేయాలని.
అందులో సామాన్యులు కూడా భాగస్వాములవుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే చాలామంది దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండంటే.. తమకు సెలవులు కావాలంటూ తమ కంపెనీ బాస్ లను అడుగుతున్నారు. మాకు ఒక వారంరోజులు సెలువులు ఇవ్వండి ఆ దుర్మార్గుడు రాజుని పట్టుకొస్తామంటూ అర్జీలు పెడుతున్నారంట.
పోలీసులు అనౌన్స్ చేసిన ఆ రివార్డు కోసం కాదంటూ.. ఆ ఘటన విన్న మాకు రక్తం మరిగిపోతుందని.. అలాంటి నీచులు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేదంటూ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరు తయారు కాకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్షలు అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.
మాకు ఆ నీచుడిని వెతికి పట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. దానికి తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తులు పెడుతున్నట్లు సమాచారం. బాధిత కుటంబసభ్యులను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు.. సీని ప్రముఖులు కూడా అక్కడికి క్యూ కడుతున్నారు. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తమ వంత భాగస్వాములు అవుతామంటూ పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…