సైదాబాద్ లో జరిగిన అత్యాచార, హత్య ఘటనపై ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు అందజేస్తామని పోలీసులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని పై ఎత్తులు వేసినా ఆ నిందితుడు మాత్రం కనిపించలేదు. అందరి డిమాండ్ ఇప్పుడు ఒక్కటే.. నిందితుడిని పట్టుకొని కఠినమైన శిక్షను అమలు చేయాలని.
అందులో సామాన్యులు కూడా భాగస్వాములవుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే చాలామంది దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండంటే.. తమకు సెలవులు కావాలంటూ తమ కంపెనీ బాస్ లను అడుగుతున్నారు. మాకు ఒక వారంరోజులు సెలువులు ఇవ్వండి ఆ దుర్మార్గుడు రాజుని పట్టుకొస్తామంటూ అర్జీలు పెడుతున్నారంట.
పోలీసులు అనౌన్స్ చేసిన ఆ రివార్డు కోసం కాదంటూ.. ఆ ఘటన విన్న మాకు రక్తం మరిగిపోతుందని.. అలాంటి నీచులు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేదంటూ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరు తయారు కాకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్షలు అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.
మాకు ఆ నీచుడిని వెతికి పట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. దానికి తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తులు పెడుతున్నట్లు సమాచారం. బాధిత కుటంబసభ్యులను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు.. సీని ప్రముఖులు కూడా అక్కడికి క్యూ కడుతున్నారు. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తమ వంత భాగస్వాములు అవుతామంటూ పేర్కొంటున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…