Categories: FeaturedGeneral News

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. మృతదేహాన్ని కనిపెట్టిన పోలీసులు..

తెలంగాణలోని సైదాబాద్ ఘటనలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన రాజును పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వినపడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి చిప్స్ ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్లగా.. ఆ చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి.. అత్యాచారం, హత్య చేశాడు రాజు అనే నిందితుడు.

అయితే ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ సీరియస్ గా తీసుకున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల వరకు తీవ్రంగా స్పందించారు. కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చెప్పట్టగా.. నిందుతుడిని పట్టుకొని న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు అతడి ఆచూకీని మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు.

పవణ్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి , వైఎస్ షర్మిల, మంచు మనోజ్ తో పాటు ఎంతో మంది బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అతడిని పట్టిస్తే నజరానాలను కూడా అందజేస్తామని సీనీ ప్రముఖులు ప్రకటించారు. అయితే తాజాగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. తర్వాత వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. ఘట్ కేసర్ రైలు పట్టాలపై పోలీసులకు అతడి మృతదేహం కనిపించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago