Tag Archives: ram charan

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Game Changer: చరణ్ గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Game Changer: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రామచరణ్. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు. బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అవుతున్న కూడా ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ లు లేవు. దాంతో దర్శకుడు శంకర్ పై చెర్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఎట్టకేలకు అభిమానులకు శుభవార్త చెబుతూ ఈ సినిమా నుంచి మొదటి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే రేపు అనగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి..అనే పాటను విడుదల చేస్తున్నారు.

150 థియేటర్స్‌లో

150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావు కరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం చెర్రీ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. మరి ఈ పాట ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఫోటోలు విడుదల కాగా ఆ ఫోటోలకు అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది.

Upasana: కూతురితో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న చరణ్ ఉపాసన.. మనసు దోచిందంటూ పోస్ట్?

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం రామ్ చరణ్ వైజాగ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వైజాగ్ లో మరికొద్ది రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతుంది అని తెలుస్తుంది.

ఈ విధంగా రాంచరణ్ ఈ సినిమా పనులలో వైజాగ్ లోనే ఉండటంతో ఉపాసన తన కుమార్తె క్లిన్ కారాతో కలిసి వైజాగ్ వచ్చారు. ఇలా వైజాగ్ రావడంతో రామ్ చరణ్ షూటింగ్ విరామ సమయంలో తన కుమార్తెతో కలసి సరదాగా బీచ్ వెళ్లి ఎంజాయ్ చేశారు ఈ విధంగా రాంచరణ్ తన కుమార్తెతో కలిసి సముద్రపు అలలను తాకుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ తన కుమార్తెను ఆడిస్తున్నారు.

మొదటి ఎక్స్పీరియన్స్..
ఇలా ఈ ముగ్గురు మొదటిసారి బీచుకు వెళ్లి ఎంజాయ్ చేయడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మ నాన్నలుగా మొదటిసారి కుమార్తె క్లీన్ కారా తో కలిసి బీచ్ వెళ్ళామని వైజాగ్ మనసును దోచిందని తెలిపారు. ఇది తన కూతురితో కలిసి మొదటి బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్లీన్ కారా చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Anasuya: అరేయ్ చిట్టిబాబు అంటూ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అనసూయ?

Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అనసూయకు సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ రావడానికి కారణం రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అని చెప్పాలి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించగా అనసూయ రంగమ్మత్త పాత్రలో నటించారు. ఇకపోతే తాజాగా అనసూయ రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది.

ఈ సినిమాలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూతురు పుట్టింది కదా తనకు రంగమ్మత్త స్టైల్ లోనే శుభాకాంక్షలు ఎలా చెబుతారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ అరే చిట్టిబాబు పాప పుట్టిందంటగా చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. జాగ్రత్తగా ఉండండే అంటూ అనసూయ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

చూడముచ్చటగా ఉన్నారు..
ఈ విధంగా అనసూయ మరోసారి చిట్టిబాబు అంటూ పిలవడంతో మరోసారి అభిమానులందరికీ కూడా రంగస్థలం సినిమా గుర్తుకు వస్తుందని చెప్పాలి ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు అనసూయ పుష్ప 2 సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Upasana: అయోధ్య బాలరామయ్య సన్నిధిలో ఉపాసన.. అయోధ్యకు అపోలో సేవలు?

Upasana: మెగా కోడలిగా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన తాజాగా తన పుట్టింటి వారితో కలిసి అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్నారు. ఈమె తన తాతయ్య ప్రతాపరెడ్డితో పాటు తన అమ్మమ్మ అమ్మతో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విధంగా ఉపాసన అయోధ్య రామయ్యను దర్శించుకోవడమే కాకుండా అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కూడా కలిశారు. ఇలా ఆయనతో కలిసి ఉపాసన అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభం గురించి ఎన్నో విషయాలను చర్చించారు. అనంతరం అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర అయినటువంటి ది అపోలో స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రతాపరెడ్డి అపోలో హాస్పిటల్ ఫౌండర్ అనే విషయం మనకు తెలిసిందే.ఈయన వైద్య రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేశారు. దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్ ఎన్నో ప్రధాన నగరాలలో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో కూడా అపోలో హాస్పిటల్ ప్రారంభించాలనే ఆలోచన ఉపాసన చేశారు. ప్రస్తుతం అపోలో బాధ్యతలను తీసుకున్న ఉపాసన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎమర్జెన్సీ సేవలు ఉచితం..
ఇకపై అయోధ్యలో కూడా అపోలో హాస్పిటల్ ప్రారంభం కాబోతుందని అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు ఎమర్జెన్సీ సేవలను అపోలో ఉచితంగా అందించబోతోంది అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలియజేయడమే కాకుండా తన తాతయ్య అపోలో సిబ్బందితో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

Upasana: ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా… భారీగా సంపాదించిన మెగా కోడలు?

Upasana: సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలా మెగా కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు.

ఇక రాంచరణ్ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఉపాసనని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఉపాసన ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలను మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

బిజినెస్ ఉమెన్ గా ఉపాసన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన బిజినెస్ నడుపుతూ భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం కేవలం ఉపాసన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు విలువ సుమారు 1130 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది.

ఆదర్శంగా నిలిచిన ఉపాసన..
కేవలం ఉపాసన మాత్రమే ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించారు అంటే ఇక మెగా ఫ్యామిలీ కూడా ఏ రేంజ్ లో ఆస్తిపాస్తులను సంపాదించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఒక కోడలిగా, భార్యగా, ఒక తల్లిగా, ఒక వ్యాపారవేత్తగా ఉపాసన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

Upasana: పెళ్లి కాగానే మరో ప్రపంచానికి వచ్చినట్టు అయింది.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Upasana: ఉపాసన పరిచయం అవసరం లేని పేరు మెగా ఇంటికోడలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే ఇలా ఈమె బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఈమె ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉన్నట్లు ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక పురుషుడు ఉండాలని ఈమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ కుటుంబం మా కుటుంబం చాలా భిన్నమైనటువంటి కుటుంబాలు నేను రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చాను అన్న భావన కలిగిందని తెలిపారు.

ఇప్పుడు చరణ్ కు నీడలా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ ఉపాసన తెలియజేశారు. మేమిద్దరం పరస్పరం ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటామని, బిడ్డలను కనాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నామని ఈమె తెలియజేశారు.

చరణ్ కు నీడలా..
మా అమ్మ వాళ్ళను మా తాతయ్య చాలా ఆత్మవిశ్వాసంతో పెంచారు. వాళ్లు కూడా ఆయన కలలకు అనుగుణంగానే నడుచుకున్నారు. ఇలా మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో కీలకపాత్ర పోషించారని, నేను స్త్రీ ప్రపంచం అని భావించే ఒక వాతావరణంలో పుట్టాను అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Charan -Ntr: చరణ్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ను అలా సేవ్ చేసుకున్నారా?

Charan -Ntr: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలో మంచి స్నేహితులగా కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒకరిని చెప్పాలి.

వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉన్నట్టు చూపించారు. అయితే సినిమాలో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇలా వీరిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉండడంతో వీరికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ను రామ్ చరణ్ తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారనే విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ని అభిమానులు తారక్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

తార్….
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తారక్ పేరును తార్ అని సేవ్ చేసుకున్నారని తెలిసి అభిమానులు వీరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పనులలో బిజీగా ఉండగా తారక్ దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Varun -Charan: చరణ్ వరుణ్ తేజ్ మధ్య ఇంత పెద్ద గొడవలు జరిగేవా.. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన వరుణ్!

Varun -Charan: సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వరుణ్ తేజ్ అలాగే రామ్ చరణ్ తేజ్ ఒకరు. వీరిద్దరూ మధ్య ఎంతో అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ లో పెద్ద అబ్బాయి కావడంతో అందరి పట్ల చాలా బాధ్యతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ వరుణ్ మధ్య చిన్నప్పుడు పెద్ద ఎత్తున గొడవలు జరిగేవని తాజాగా వరుణ్ తేజ్ ఆ గొడవలను గుర్తుచేసుకొని మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తన అన్నయ్య చరణ్ తో చిన్నప్పుడు పడిన గొడవల గురించి పలు విషయాలు వెల్లడించారు. కెరీర్ మొదట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పలు యాడ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే చరణ్ పవన్ పార్టీ కాగా వరుణ్ పెదనాన్న చిరంజీవి పార్టీ.

పెదనాన్న ఉంటే సేఫ్…

పెదనాన్న చేసిన యాడ్స్ బాగున్నాయని వరుణ్ లేదు బాబాయ్ చేసిన యాడ్స్ బాగున్నాయని చరణ్ ఇద్దరు బాగా గొడవపడేవారట అయితే చిరంజీవి గారు ఇంట్లో ఉన్నప్పుడు తాను సేఫ్ అయ్యేవాడిని ఒకసారి పెదనాన్న బయటికి పోతే చరణ్ అన్న నాతో ఆట ఆడుకునేవారు అంటూ అప్పట్లో వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవలను గుర్తు చేసుకుంటూ వరుణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.