Tag Archives: ration card

Good News: రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి కేంద్రం శుభవార్త..ఇక ఆ సమస్య తీరినట్లే..!

Good News: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు, సొంత ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తున్నా.. రేషన్ కార్డు, ఇల్లు లేని వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లు మన చుట్టు ఎంతో మంది ఉన్నారు. వీరికి మేలు జరిగే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది.

Good News: రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి కేంద్రం శుభవార్త..ఇక ఆ సమస్య తీరినట్లే..!

ఎలాంటి సబ్సిడీ లేకుండా.. ఆహార ధాన్యాలు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. అలాంటి వారి డేటాను సేకరించే పనిలో పడింది. ఇదిలా ఉండగా.. దేశంలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కేజీకి రూ.1 నుంచి రూ. 3 ధరతో ధాన్యాలు లభిస్తున్నాయి. అయితే చాలా మంది రేషన్ కార్డు లేకుండా.. ఇల్లు లేని వాళ్లు చాలామంది ఉన్నారు.

Good News: రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి కేంద్రం శుభవార్త..ఇక ఆ సమస్య తీరినట్లే..!

81 కోట్ల మందికి రేషన్ కార్డు ఉండగా.. మిగిలిన 1.6 కోట్ల మంది ఆ ధాన్యాలు పొందలేకపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఈ ప్రయోజనాన్ని రేషన్ కార్డు లేని వారికి కూడా కల్పించారు.

ఇల్లు లేని నిరాశ్రయులకు మేలు..

తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నెల చివరి వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారికి ఈ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదలు అందరి వివరాలు సేకరిస్తోంది కేంద్రం. ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 1.6 కోట్ల మందిని ఎన్ఎఫ్ఎస్ఏ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇల్లు లేని వారు నిరాశ్రయులు, సరైన ఐడెంటిటీ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారు సబ్సిడీ రేటు ఆహార ధాన్యాలు లేదా ఉచిత బియ్యాని ఈ విధానం ద్వరా పొందొచ్చు.

ఉచితంగానే కేంద్రం రూ.50 వేలు ఇస్తుంది.. ఇలా చేస్తే చాలు?

కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహించి 50 వేల రూపాయల క్యాష్ రివార్డును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంతో ఆసక్తి ఉన్నవారు ఈ కాంటెస్ట్ లో పాల్గొని మన ఇంట్లో ఉంటూ 50 వేల రూపాయల ప్రైజ్ మనీ పొందే అవకాశం కల్పించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాంటెస్ట్ ఏమిటి? ప్రైజ్ మనీ ఏ విధంగా పొందాలి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కోసం ఒక లోగోను గీయాలి. ఈ లోగో గీసిన విజేతకు యాభై వేల రూపాయల ప్రైజ్ మనీ ను కేంద్ర ప్రభుత్వం అందించనునట్టు మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఈ కాంటెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మే 31 వరకు గడుపు ఉంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అభ్యర్థులు లోగోను ఎంతో అర్థవంతంగా గీయాలి. అదేవిధంగా లోగోకి సంబంధించి 100 పదాలతో వివరణ కూడా ఇవ్వాలి. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మూడు ఎంట్రీలు ఉంటాయి.

ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న విజేతకు 50 వేల రూపాయలు బహుమతితో పాటు, సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు.అదే విధంగా మరో ముగ్గురికి సర్టిఫికేట్ అందజేయనున్నారు. మరెందుకు ఆలస్యం మీ లో ఉన్న ప్రతిభను బయట పెట్టి ఈ కాంటెస్ట్ లో పాల్గొని 50వేల బహుమతిని గెలుపొందండి.

రేషన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే నష్టపోయే ఛాన్స్..?

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి నెల నుంచి రేషన్ పొందాలంటే మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను రేషన్ డీలర్ కు తెలియజేయాలి. ఓటీపీ అథంటికేషన్ ద్వారా మాత్రమే ఫిబ్రవరి నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుంది. సాధారణ రేషన్ కార్డులతో పాటు అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు ఉన్నవాళ్లకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.

కరోనా విజృంభణ వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి బయోమెట్రిక్ అథంటికేషన్‌ ను నిలిపివేసింది. అయితే బయోమెట్రిక్ అథంటికేషన్‌ ను నిలిపివేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపడుతోంది. నివేదికల ప్రకారం రేపటి నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధన గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాలు ఆధార్ కార్డు నంబర్ కు మొబైల్ ఫోన్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోని వారు సమీపంలోని ఆధార్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. అవగాహన ఉన్నవాళ్లు యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా కూడా వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. వన్ టైమ్ పాస్ వర్డ్ చెప్పలేకపోతే రేషన్ సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు.

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఓటిపీ చెబితేనే రేషన్ పంపిణీ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేరే విధంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ త్వరలో రేషన్ ఇంటికి పంపిణీ చేసే విధంగా సరికొత్త విధానం అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తే సరుకులు ఇంటికి చేరతాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరగగా 2021 సంవత్సరం జనవరి 1 నుంచి వాహనాల ద్వారా రేషన్ ను సరఫరా చేయనున్నారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకులను వాలంటీర్లు వాళ్లకు కేటాయించిన ఇళ్లకు పంపిణీ చేస్తారు. అయితే రేషన్ పొందాలంటే రేషన్ కార్డు లబ్ధిదారుడు కార్డుతో మొబైల్ నంబర్ ను లింక్ చేసుకొని ఉండాలి.

రేషన్ తీసుకునే సమయంలో మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా వాలంటీర్లు సీరియల్ నంబర్ ప్రకారం రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నారు. 2021 సంవత్సరం జనవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ప్రతి రేషన్ కార్డుదారుడి మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు నమోదు చేస్తే మాత్రమే సరుకుల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. నూతన విధానం ద్వారా రేషన్ లో అక్రమాలను సులభంగా అరికట్టవచ్చు.

జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితం నుంచే ఈ విధానం అమలు కోసం ప్రయత్నాలు చేయగా వివిధ కారణాల వల్ల ఈ విధానం అమలు వాయిదా పడుతూ వస్తోంది. జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నూతన నిర్ణయాలను, విధానాలను అమలులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం.

రేషన్ కార్డుదారులకు అలర్ట్. ఈ తప్పు చేస్తే రేషన్ కట్…?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులను చేస్తుంది. అయితే కేంద్రం నిబంధనలలో ఎన్ని మార్పులు చేస్తున్నా కొందరు మాత్రం అక్రమంగా రేషన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొందరు అక్రమంగా రేషన్ పొందుతున్నారు.

కేంద్రం ఇప్పటికే అక్రమంగా రేషన్ పొందుతున్న 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయగా మరి కొంతమంది రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేషన్ కార్డుల ద్వారా అక్రమాలకు తావివ్వకూడదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రద్దు చేసిన రేషన్ కార్డులలో అర్హులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

కేంద్రం ఇప్పటికే మరణించిన వారి రేషన్ కార్డులను తొలగించడంతో పాటు నకిలీ కార్డులు పొందిన వారికి డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా రేషన్ అందకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఎవరైనా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోతే ఈ నెల 30వ తేదీలోగా అనుసంధానం చేయాలి. అలా అప్ డేట్ చేయని వాళ్లు రేషన్ కోల్పోయే లేదా రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.

అందువల్ల రేషన్ కార్డు వినియోగదారులు తప్ప్నిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలను తెచ్చుకుని ఇబ్బంది పడే బదులు ముందుగానే రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసి జాగ్రత్త పడితే మంచిది.