తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి నెల నుంచి రేషన్ పొందాలంటే మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను రేషన్ డీలర్ కు తెలియజేయాలి. ఓటీపీ అథంటికేషన్ ద్వారా మాత్రమే ఫిబ్రవరి నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుంది. సాధారణ రేషన్ కార్డులతో పాటు అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు ఉన్నవాళ్లకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.
కరోనా విజృంభణ వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి బయోమెట్రిక్ అథంటికేషన్ ను నిలిపివేసింది. అయితే బయోమెట్రిక్ అథంటికేషన్ ను నిలిపివేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపడుతోంది. నివేదికల ప్రకారం రేపటి నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధన గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాలు ఆధార్ కార్డు నంబర్ కు మొబైల్ ఫోన్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోని వారు సమీపంలోని ఆధార్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. అవగాహన ఉన్నవాళ్లు యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా కూడా వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. వన్ టైమ్ పాస్ వర్డ్ చెప్పలేకపోతే రేషన్ సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు.
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…