ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాటోలీ ఎస్బీఐ బ్రాంచ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక యువతి పింఛను కోసం తండ్రిని మూడుసార్లు చంపేసింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటనలో వాస్తవాలు తెలిసి బ్యాంకు అధికారులే ఖంగు తిన్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల కోసం ఒక యువతి ఒక వ్యక్తికి సంబంధించిన మూడు డెత్ సర్టిఫికెట్లను చూపించింది. అనుమానం వచ్చి అధికారులు ఆరా తీయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని గ్వాటోలీ బ్రాంచ్ లో మహమ్మద్ హలీమ్ అనే వ్యక్తి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ వ్యక్తి తండ్రి పేరు మహబూబ్ అలీ అని ఆ వ్యక్తి మకరాబర్ట్ గంజ్ కు చెందిన వ్యక్తి అని ఉంది. 2001 సంవత్సరం జూన్ నెలలో గ్వాటోలీ బ్రాంచ్ లో ఈ బ్యాంక్ అకౌంట్ ను తెరిచారు. 2011 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ బ్యాంక్ అకౌంట్ లో చివరగా లావాదేవీలు జరిగాయి.
ప్రతి సంవత్సరం ఈ అకౌంట్ లో పింఛన్ తో పాటు వడ్డీ జమవుతోంది. అయితే రెండు రోజుల క్రితం అర్షాఖాన్ అనే యువతి మూడేళ్ల క్రితం మహమ్మద్ హలీమ్ మృతి చెందాడని డెత్ సర్టిఫికెట్ ను అందజేసి అవసరమైన ఫారాలను కూడా ఆమె నింపింది. అయితే డెత్ సర్టిఫికెట్ లో 2011లో మహమ్మద్ హలీమ్ మృతి చెందినట్టు ఉండటంతో బ్యాంకు అధికారులకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.
మొదట 2017 డెత్ సర్టిఫికెట్ ను చూపించిన యువతి ఆ తరువాత 2011 డెత్ సర్టిఫికెట్ ను చూపించింది. బ్యాంక్ అధికారులు ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ చూపించాలని కోరగా యువతి ఆ తరువాత 2018 డెత్ సర్టిఫికెట్ ను చూపించింది. ఒకే యువతి మూడు డెత్ సర్టిఫికెట్లను చూపించడంతో విచారణ చేసిన అధికారులకు యువతి ఆ వ్యక్తి కూతురు కాదని అర్థమైంది. బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…