General News

ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త.. ఏటీఎంకు వెళ్లకుండా నగదు విత్ డ్రా..?

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డ్ లేకుండానే నగదు విత్ డ్రా చేసే అవకాశాన్ని కల్పించింది. సరికొత్త ఫీచర్ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు సులభంగా నగదు విత్ డ్రా చేయవచ్చు. అయితే ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా నగదు విత్ డ్రా చేయడం సాధ్యం కాదు. యోనో యాప్ ద్వారా నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్నవారు మాత్రమే ఈ విధంగా నగదు విత్ డ్రా చేయవచ్చు.

ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రిజిష్టర్ అయిన వారు ఆ వివరాల ద్వాఅరా ఎస్బీఐ యోనో యాప్ లోకి లాగ్ ఇన్ కావచ్చు. యోనో యాప్ లోకి లాగిన్ అయిన తరువాత యోనో క్యాష్ పై క్లిక్ చేసి విత్ డ్రా చేయాలనుకున్న అమౌంట్ ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఎస్బీఐ అకౌంట్ కు లింక్ అయిన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది. ఆ వివరాలను యోనో క్యాష్ పాయింట్లలో వినియోగించి నగదు విత్ డ్రా చేయవచ్చు.

మారుతున్న కాలానికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్ మెసేజ్ మొబైల్ ఫోన్ కు వచ్చిన సమయం నుంచి కేవలం 4 నాలుగు గంటలు మాత్రమే పని చేస్తుందని ఆ తర్వాత పని చేయదని తెలుస్తోంది. ఈ విధంగా కాకుండా మరో విధంగా కూడా నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఎస్బీఐ ఏటీఎంల నుంచి ఏటీఎం లేకుండా క్యాష్ విత్ డ్రా చేసుకోవాలని భావించే వాళ్లు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత యోనో క్యాష్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకొని సులభంగా క్యాష్ విత్ డ్రా చేసోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

3 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

33 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

1 hour ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

1 hour ago