సాధారణంగా కొన్ని విషయాలలో కొంతమంది అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఎలాంటి పనులు చేయడానికి ప్రారంభించిన కూడా ఇవి చేయవచ్చా? లేదా? అనే సందేహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే చాలామంది పూజా కార్యక్రమాలలో కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఇండ్లలో శివలింగాన్ని ఉంచుకోవచ్చని భావిస్తారు. మరి కొందరు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకొని పూజ చేయకూడదని చెబుతుంటారు. అయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? లేదా? అనే సందేహం చాలామందికి కలుగుతుంది.
మన ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు అని, ఒకవేళ శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకున్నట్లైతే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించాలని భావిస్తారు. ఆ విధంగా చేయకపోతే మన ఇంట్లో ఏవైనా ప్రమాదాలు, సమస్యలు వస్తాయని భావిస్తారు. ఈ విధంగా శివ లింగం గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే శివలింగం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం….
మన ఇంట్లో శివలింగాన్ని ఉంచుకొని పూజించవచ్చు. అయితే బొటనవేలు సైజులో వున్న శివ లింగాన్ని పూజించడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లోనూ శివలింగాన్ని తప్పకుండా పూజించుకోవచ్చు. శివాలయం లేని ఊరు స్మశానంగా భావిస్తారు కాబట్టి, స్మశానంలో కూడా మనకు శివలింగం దర్శనమిస్తుంది. స్మశానంలోనే శివలింగం దర్శనమిస్తే మన ఇంట్లో ఉండకూడద? కాబట్టి మన ఇంట్లో బొటనవేలు సైజులో ఉన్న శివలింగాన్ని ఉంచుకొని పూజించటం వల్ల మంచే జరుగుతుందనే పండితులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు శివ లింగానికి మంచినీటితో అభిషేకం చేయడం మంచిది. ఒకవేళ చేయడం కుదరక పోయినా పరవాలేదు. ఈ విధంగా ప్రతి రోజు శివలింగానికి అభిషేకం చేయడం వీలు కుదరదు కాబట్టి బొటనవేలు సైజులో ఉన్న శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే పెద్ద శివలింగాలు అయితే ప్రతి రోజు క్రమం తప్పకుండా అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించాలి. ఈ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమశ్శివాయ అని పలుకుతూ శివుడికి అభిషేకం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…