కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహించి 50 వేల రూపాయల క్యాష్ రివార్డును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంతో ఆసక్తి ఉన్నవారు ఈ కాంటెస్ట్ లో పాల్గొని మన ఇంట్లో ఉంటూ 50 వేల రూపాయల ప్రైజ్ మనీ పొందే అవకాశం కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాంటెస్ట్ ఏమిటి? ప్రైజ్ మనీ ఏ విధంగా పొందాలి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కోసం ఒక లోగోను గీయాలి. ఈ లోగో గీసిన విజేతకు యాభై వేల రూపాయల ప్రైజ్ మనీ ను కేంద్ర ప్రభుత్వం అందించనునట్టు మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ కాంటెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మే 31 వరకు గడుపు ఉంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అభ్యర్థులు లోగోను ఎంతో అర్థవంతంగా గీయాలి. అదేవిధంగా లోగోకి సంబంధించి 100 పదాలతో వివరణ కూడా ఇవ్వాలి. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మూడు ఎంట్రీలు ఉంటాయి.
ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న విజేతకు 50 వేల రూపాయలు బహుమతితో పాటు, సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు.అదే విధంగా మరో ముగ్గురికి సర్టిఫికేట్ అందజేయనున్నారు. మరెందుకు ఆలస్యం మీ లో ఉన్న ప్రతిభను బయట పెట్టి ఈ కాంటెస్ట్ లో పాల్గొని 50వేల బహుమతిని గెలుపొందండి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…