కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహించి 50 వేల రూపాయల క్యాష్ రివార్డును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంతో ఆసక్తి ఉన్నవారు ఈ కాంటెస్ట్ లో పాల్గొని మన ఇంట్లో ఉంటూ 50 వేల రూపాయల ప్రైజ్ మనీ పొందే అవకాశం కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాంటెస్ట్ ఏమిటి? ప్రైజ్ మనీ ఏ విధంగా పొందాలి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కోసం ఒక లోగోను గీయాలి. ఈ లోగో గీసిన విజేతకు యాభై వేల రూపాయల ప్రైజ్ మనీ ను కేంద్ర ప్రభుత్వం అందించనునట్టు మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ కాంటెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మే 31 వరకు గడుపు ఉంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అభ్యర్థులు లోగోను ఎంతో అర్థవంతంగా గీయాలి. అదేవిధంగా లోగోకి సంబంధించి 100 పదాలతో వివరణ కూడా ఇవ్వాలి. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మూడు ఎంట్రీలు ఉంటాయి.
ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న విజేతకు 50 వేల రూపాయలు బహుమతితో పాటు, సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు.అదే విధంగా మరో ముగ్గురికి సర్టిఫికేట్ అందజేయనున్నారు. మరెందుకు ఆలస్యం మీ లో ఉన్న ప్రతిభను బయట పెట్టి ఈ కాంటెస్ట్ లో పాల్గొని 50వేల బహుమతిని గెలుపొందండి.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…