Tag Archives: sarkaru vari pata

Sarkaru Vari Pata: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పరుశురామ్.. ఆ తప్పును చూపిస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్?

Sarkaru Vari Pata: మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరికెక్కిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద మొదట్లో నెగిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ అనంతరం అత్యధిక కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్లో ఎంతో విజయవంతంగా ప్రదర్శన పూర్తి చేసుకొని తిరిగి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది.

ఇక అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సాధారణంగా సినిమాని థియేటర్లో చూసినప్పుడు అందులో తప్పులను కనిపెట్టడం ప్రేక్షకులకు కష్టతరం. అయితే అదే సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సమయంలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇలా క్షుణ్ణంగా చూసిన నేపథ్యంలో అందులో తప్పులను ఎత్తి చూపెడుతుంటారు.

ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో ఇలాంటి తప్పులను ఎన్నో కనిపెట్టారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటలో కూడా తప్పులను కనిపెడుతూ దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఢిల్లీ జైలులో జరిగే ఓ సన్నివేశం ఉంది. ఇందులో నటి నదియాను కలవడానికి మహేష్ బాబు వెళ్లేటప్పుడు విలన్ ని కూడా తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో విలన్ ను పండ్లు తీసుకు రమ్మని మహేష్ బాబు చెబుతాడు.

డైరెక్టర్ ను ఆడుకుంటున్న నెటిజన్స్…

ఇక మహేష్ బాబు విలన్ నదియాను కలిసినప్పుడు తనకు పండ్లు ఇస్తారు. అయితే ఆ పండ్లను ఆమె తీసుకోదు.నిజానికి అక్కడ పండ్లు తీసుకోవడానికి కూడా స్పేస్ లేకపోవడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఈ తప్పును చూపెడుతూ పెద్ద ఎత్తున డైరెక్టర్ పరుశురామ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ లు చేస్తున్నారు.

Sarkaru Vaari Paata Twitter Review : సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..

Sarkaru Vaari Paata Twitter Review : మహేష్ బాబు, కీర్తీ సురేష్ తొలిసారి జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే నిన్నటి నుండే ప్రీమియర్ షోల సందడి మొదలయింది. రెండు సంవత్సరాల తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో బాగా అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా టీజర్, ట్రైలర్ మరింత అభిమానులను ఊరించాయి.

Sarkaru Vaari Paata Twitter Review

ఫస్ట్ హాఫ్ బొమ్మ అదిరింది….

ఇక కళావతి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. ఇక సితార డాన్స్ చేసిన పెన్నీ సాంగ్, హీరో సోలో సాంగ్, ఇక చివర్లో విడుదల చేసినా బాగా క్రేజ్ సంపాదించుకున్న మ మ మహేశా పాట సూపర్ స్టార్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సినిమా ను పోకిరి సినిమాతో పోల్చడం తో మరింత హైపర్ వచ్చింది. ఈ రోజు విడుదల అయిన సినిమా గురించి అపుడే నెట్టింట్లో చర్చ మొదలయిపోయింది.

మహేష్ కెరీర్ లో బెస్ట్ సినిమా కామెడీ టైమింగ్ అదిరింది అయితే కొన్ని చోట్ల థమన్ బిజీఎం బాగోలేదు అంటూ కొంతమంది నెటిజన్స్ అభిప్రాయ పడ్డారు. మరో నెటిజెన్ సినిమా మొదటి భాగం బాగుంది యాక్షన్ సన్నివేశాలకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లకు థమన్ బిజీఎం బాగోలేదు. ఇక మరో నెటిజెన్ మహేష్ వన్ మాన్ షో, కామెడీ ట్రాక్ బాగుంది సినిమాలో అన్న లుక్ సూపర్ అంటూ పోస్ట్ చేసాడు. ఇక ఈ రివ్యూలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ ! ఎంతో నమ్మి వాడికి పనిస్తే.. ఇలా చేస్తాడని అనుకోలేదు : తమన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరెకెక్కితున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతలో వీరికి పిడుగులాంటి షాక్ తగిలింది. ఈ సినిమాలోని కళావతి సాంగ్ ను వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయాల్సి ఉండగా.. దాని కంటే ముందే నెట్టింట్లో చక్కెర్లు కొట్టింది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

ఈ పాటకు సంబంధించి ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ప్రేమికుల రోజున విడుదల చేసి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న మూవీ మేకర్స్ కు లీక్ రాజాలు షాక్ ఇచ్చారు. నెట్లో ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లిరికల్ సాంగ్ లీక్ పై స్పందించిన థమన్..! గుండె పగిలింది అంటూ.. !

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రతీది లీక్ అవుతూనే వస్తోంది. మొన్నటికి మొన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌.. నేడు మొదటి లిరికల్ సాంగ్.. ఇలా ప్రతీది పైరసీ బారిన పడుతోంది. మొదటి నుంచి కూడా పైరసీ సినిమా రంగాన్ని వదిలి పెట్టడం లేదు. ఇలా సినిమా విడుదల కాకముందే లీక్ ల ద్వారా పాటలు, పోస్టర్లను విడుదల చేయడంతో.. అభిమానులు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ..

ఇదిలా ఉండగా.. దీనిపై సంగీత దర్శకుడు థమన్ తీవ్ర ఆవేదన చెందారు. ఇలా జరగడం తనను ఎంతో బాధ కలిగించిందని.. ఈ పాట కోసం దాదాపు 6నెలలు కష్టపడ్డామన్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారని తెలిపాడు. ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్‌ కూడా వచ్చిందని తెలిపారు. అందుకే మధ్యలో షూటింగ్ నిలిపివేసి.. మళ్లీ స్టార్ట్ చేశామని అన్నారు.
ఇంత కష్టపడి చేసిన పాటను ఇలా సింపుల్ గా నెట్టింట్లో విడుదల చేశారు.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె పగిలినంత పనైంది అంటూ ఆవేదన చెందాడు. తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని.. తన లైఫ్ లో ఎన్నో ఎదుర్కొన్నాను… కానీ ఈ విషయంపై తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పారు. పైరసీ అంటే ఎంత ఘోరమైన చర్యో తెలియాలనే తాను ఈ ఆడియో నోట్ ను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నానని.. ట్విట్టర్ ఖాతాలో అతడు తన ఆడియో ఫైల్ ను షేర్ చేశాడు. ఇక ఈ పాట లీక్ అయిన నేపథ్యంలో నేడు అధికారికంగా ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

సర్జరీ చేయించుకున్న మహేశ్ బాబు.. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు బ్రేక్..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సర్జరీ అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్ లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అతడితో పాటు మహేశ్ సతీమణి నమ్రతా కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అతడు వెల్లడించారు.

త్వరలో తాను సర్జరీకి వెళ్తున్నానని అందుకే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పాడు. ఈ నాలుగు రోజులు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపాడు. అంతేకాదు.. తన సినిమాలను మొదట కుటుంబసభ్యులతో కలిసి చూస్తానని.. సినిమాలో ఫైట్ సీన్లంటే తన కూతురుకు ఇష్టం ఉండదని.. అటువంటి సమయంలో ఆమె అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుందని అని కూడా చెప్పాడు.

ఇక ప్రస్తుతం అతడికి సర్జరీ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత మిగతా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇంకా ముఖ్యమైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని మూవీ సభ్యులు తెలుపుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.