Sarkaru Vari Pata: మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరికెక్కిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద మొదట్లో నెగిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ అనంతరం అత్యధిక కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్లో ఎంతో విజయవంతంగా ప్రదర్శన పూర్తి చేసుకొని తిరిగి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సాధారణంగా సినిమాని థియేటర్లో చూసినప్పుడు అందులో తప్పులను కనిపెట్టడం ప్రేక్షకులకు కష్టతరం. అయితే అదే సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సమయంలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇలా క్షుణ్ణంగా చూసిన నేపథ్యంలో అందులో తప్పులను ఎత్తి చూపెడుతుంటారు.
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో ఇలాంటి తప్పులను ఎన్నో కనిపెట్టారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటలో కూడా తప్పులను కనిపెడుతూ దారుణంగా డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఢిల్లీ జైలులో జరిగే ఓ సన్నివేశం ఉంది. ఇందులో నటి నదియాను కలవడానికి మహేష్ బాబు వెళ్లేటప్పుడు విలన్ ని కూడా తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో విలన్ ను పండ్లు తీసుకు రమ్మని మహేష్ బాబు చెబుతాడు.
ఇక మహేష్ బాబు విలన్ నదియాను కలిసినప్పుడు తనకు పండ్లు ఇస్తారు. అయితే ఆ పండ్లను ఆమె తీసుకోదు.నిజానికి అక్కడ పండ్లు తీసుకోవడానికి కూడా స్పేస్ లేకపోవడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఈ తప్పును చూపెడుతూ పెద్ద ఎత్తున డైరెక్టర్ పరుశురామ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…