టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సర్జరీ అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్ లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అతడితో పాటు మహేశ్ సతీమణి నమ్రతా కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అతడు వెల్లడించారు.
త్వరలో తాను సర్జరీకి వెళ్తున్నానని అందుకే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పాడు. ఈ నాలుగు రోజులు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపాడు. అంతేకాదు.. తన సినిమాలను మొదట కుటుంబసభ్యులతో కలిసి చూస్తానని.. సినిమాలో ఫైట్ సీన్లంటే తన కూతురుకు ఇష్టం ఉండదని.. అటువంటి సమయంలో ఆమె అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుందని అని కూడా చెప్పాడు.
ఇక ప్రస్తుతం అతడికి సర్జరీ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత మిగతా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇంకా ముఖ్యమైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని మూవీ సభ్యులు తెలుపుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…