టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సర్జరీ అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్ లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అతడితో పాటు మహేశ్ సతీమణి నమ్రతా కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అతడు వెల్లడించారు.
త్వరలో తాను సర్జరీకి వెళ్తున్నానని అందుకే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పాడు. ఈ నాలుగు రోజులు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపాడు. అంతేకాదు.. తన సినిమాలను మొదట కుటుంబసభ్యులతో కలిసి చూస్తానని.. సినిమాలో ఫైట్ సీన్లంటే తన కూతురుకు ఇష్టం ఉండదని.. అటువంటి సమయంలో ఆమె అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుందని అని కూడా చెప్పాడు.
ఇక ప్రస్తుతం అతడికి సర్జరీ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత మిగతా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇంకా ముఖ్యమైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని మూవీ సభ్యులు తెలుపుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…