Tag Archives: siva sankar master

శివ శంకర్ మాస్టర్ కు ఆర్థిక సహాయం చేసిన మెగాస్టార్..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్న పేరు ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.డాన్సర్ గా,ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత అయిన శివ శంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అతని ఆరోగ్యం విషమంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కరోనా వల్ల శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటుగా అతడి భార్యకి కరోనా నిర్ధారణ అవ్వడంతో ఆమె ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.కుమారుడి చికిత్సకు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనితో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కు అండగా మంచు విష్ణు, హీరో ధనుష్, సోను సూద్ లాంటివారు ముందుకు వచ్చి తాము ఉన్నామని తెలిపారు. ఇక తాజాగా శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే వైద్యానికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

ఇక శివ శంకర్ మాస్టర్ తనయుడు అజయ్ మాట్లాడుతూ.. నాన్నకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే చిరంజీవిగారు ఫోన్ చేసి పిలిపించారని, తన సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారని అతను తెలిపారు. మెగాస్టార్ ఈ మూడు లక్షల చెక్కును అజయ్ కు అందజేశారు. ఇక చిరంజీవికి, తన నాన్నకి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అజయ్. చిరంజీవి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విషమంగానే శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి.. ఈ కుటుంబానికి అండగా నిలిచిన హీరో ధనుష్..!

గత నాలుగు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన చిన్న కొడుకు మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలోనే మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే మాస్టర్ ఊపిరితిత్తులు 75% ఇన్ఫెక్షన్ అయ్యాయని వైద్యులు వెల్లడించడంతో ఈయనకు రోజు చికిత్స అందించడానికి సుమారు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవడంతో అతని కుటుంబ సభ్యులు డబ్బుకోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనుసూద్ వెంటనే స్పందిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉన్నాను ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు అంటూ సోను సూద్ భరోసా ఇచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక హీరో తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య విషయంపై స్పందించారు.

ఈ సందర్భంగా ధనుష్ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. అయితే ఎంత మొత్తంలో అతని కుటుంబానికి సహాయం చేశారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక ధనుష్ తన మూడవ సినిమాగా తెరకెక్కిన తిరుడా తిరుడి అనే చిత్రానికి శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆ పరిచయంతోనే నేడు ఆయనకు ధనుష్ ఆర్థిక సహాయం చేశారు.

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన సోనుసూద్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనుసూద్ గత నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయన పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురయ్యారని 75శాతం అతనికి ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆయనకు చికిత్స అందించాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వార్త గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు రియల్ హీరో సోను సూద్ స్పందించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ ఇదే విషయం గురించి శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అతని చికిత్స కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎలాగైనా తన ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడటంతో ఆయన పెద్ద కుమారుడు, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇక తన భార్య హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక శివ శంకర్ మాస్టర్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించడమే కాకుండా జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు.

శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం… దాతల కోసం ఎదురు చూపులు..!

కరోనా మహమ్మారి రెండో వేవ్ తర్వాత దాని వ్యాప్తి తగ్గింది అనుకున్నారు. కానీ అది ఇంకా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కరోనా వదిలి పెట్టడం లేదు. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశ్వ నటుడు కమల్ హాసన్‌కి, ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అంతే కాకుండా.. తెలంగాణ స్పీకర్ పోచారంకు కూడా కరోనా మహమ్మారి సోకింది. అయితే జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాణలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు.

75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెన్షన్‌ సోకినట్టు వైద్యులు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ పెద్దకుమారుడు కూడా కరోనా మహమ్మారి బారిన పడి అపస్మారకస్థితికి చేరారు. శివశంకర్‌ భార్యకు కూడా కరోనా సోకడంతో హోంక్వారెంటైన్‌లో ఉన్నారు. మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శివశంకర్ మాస్టర్, ఆయన కుమారుడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ కుటుంబం. ఇక అతడికి 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన అనుభవముంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌కు ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది.