గత నాలుగు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన చిన్న కొడుకు మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలోనే మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటికే మాస్టర్ ఊపిరితిత్తులు 75% ఇన్ఫెక్షన్ అయ్యాయని వైద్యులు వెల్లడించడంతో ఈయనకు రోజు చికిత్స అందించడానికి సుమారు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవడంతో అతని కుటుంబ సభ్యులు డబ్బుకోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనుసూద్ వెంటనే స్పందిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉన్నాను ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు అంటూ సోను సూద్ భరోసా ఇచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక హీరో తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య విషయంపై స్పందించారు.
ఈ సందర్భంగా ధనుష్ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. అయితే ఎంత మొత్తంలో అతని కుటుంబానికి సహాయం చేశారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక ధనుష్ తన మూడవ సినిమాగా తెరకెక్కిన తిరుడా తిరుడి అనే చిత్రానికి శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆ పరిచయంతోనే నేడు ఆయనకు ధనుష్ ఆర్థిక సహాయం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…