ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై సినీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆన్లైన్ టికెటింగ్ బిల్లు పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని చెబుతూనే.. టికెట్ల రేట్లను కాలాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పించి ఉంటే మరింత బాగుండేదని చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఈ క్రమంలోనే సినిమా టికెట్ల విషయం గురించి అన్ని రాష్ట్రాలలో ఉండే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండాలని ఆయన కోరారు.ఇలా చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పోరాడాలని విజ్ఞప్తి చేయకూడదంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేశారు. ఈ విధంగా సినీ పెద్దగా వ్యవహరించిన చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రికి ట్వీట్ చేయడంతో కొందరు నెటిజనులు స్పందిస్తూ ఈ వ్యవహారం మధ్యలోకి మా అధ్యక్షుడు మంచు విష్ణును లాగారు.
ఇండస్ట్రీలో ఏదైనా ఆపద వస్తే ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏకమై ఆ సమస్యను పరిష్కరించాలి.మరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులలో ముందుండి నడిపించాల్సిన మా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లారు.సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంచు విష్ణు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…