గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్న పేరు ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.డాన్సర్ గా,ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత అయిన శివ శంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అతని ఆరోగ్యం విషమంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
కరోనా వల్ల శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటుగా అతడి భార్యకి కరోనా నిర్ధారణ అవ్వడంతో ఆమె ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.కుమారుడి చికిత్సకు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనితో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కు అండగా మంచు విష్ణు, హీరో ధనుష్, సోను సూద్ లాంటివారు ముందుకు వచ్చి తాము ఉన్నామని తెలిపారు. ఇక తాజాగా శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే వైద్యానికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఇక శివ శంకర్ మాస్టర్ తనయుడు అజయ్ మాట్లాడుతూ.. నాన్నకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే చిరంజీవిగారు ఫోన్ చేసి పిలిపించారని, తన సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారని అతను తెలిపారు. మెగాస్టార్ ఈ మూడు లక్షల చెక్కును అజయ్ కు అందజేశారు. ఇక చిరంజీవికి, తన నాన్నకి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అజయ్. చిరంజీవి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…