మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటివలె రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ మళ్లీ బయటకు రావడం మొదలు పెట్టారు. సాయి తేజ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా 26న జీ 5 లో ఓటీటీ కానున్న సందర్భంగా తన అభిమానులకు ఆడియో సందేశం పంపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిన్న అనగా నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికలో విడుదల అయింది.
ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడలేకపోయానని, అందువల్ల ఓటీటీ వేదికగా అందరూ కలిసి చూద్దాం. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలపండి అంటూ అభిమానులను కోరారు సాయి ధరమ్ తేజ్. చెప్పిన విధంగానే దర్శక నిర్మాతలతో కలిసి సినిమాని చూశాడు సాయి ధరమ్ తేజ్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాయి తేజ్ తో పాటుగా దర్శకుడు దేవా కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, ప్రొడ్యూసర్ సతీష్ బీకెఎఆర్, జి స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయ లతో కలిసి ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి తేజ్ అభిమానులు అతడు త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…