మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటివలె రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ మళ్లీ బయటకు రావడం మొదలు పెట్టారు. సాయి తేజ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా 26న జీ 5 లో ఓటీటీ కానున్న సందర్భంగా తన అభిమానులకు ఆడియో సందేశం పంపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిన్న అనగా నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికలో విడుదల అయింది.
ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడలేకపోయానని, అందువల్ల ఓటీటీ వేదికగా అందరూ కలిసి చూద్దాం. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలపండి అంటూ అభిమానులను కోరారు సాయి ధరమ్ తేజ్. చెప్పిన విధంగానే దర్శక నిర్మాతలతో కలిసి సినిమాని చూశాడు సాయి ధరమ్ తేజ్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాయి తేజ్ తో పాటుగా దర్శకుడు దేవా కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, ప్రొడ్యూసర్ సతీష్ బీకెఎఆర్, జి స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయ లతో కలిసి ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి తేజ్ అభిమానులు అతడు త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…