మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటివలె రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ మళ్లీ బయటకు రావడం మొదలు పెట్టారు. సాయి తేజ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా 26న జీ 5 లో ఓటీటీ కానున్న సందర్భంగా తన అభిమానులకు ఆడియో సందేశం పంపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిన్న అనగా నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికలో విడుదల అయింది.
ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడలేకపోయానని, అందువల్ల ఓటీటీ వేదికగా అందరూ కలిసి చూద్దాం. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలపండి అంటూ అభిమానులను కోరారు సాయి ధరమ్ తేజ్. చెప్పిన విధంగానే దర్శక నిర్మాతలతో కలిసి సినిమాని చూశాడు సాయి ధరమ్ తేజ్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాయి తేజ్ తో పాటుగా దర్శకుడు దేవా కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, ప్రొడ్యూసర్ సతీష్ బీకెఎఆర్, జి స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయ లతో కలిసి ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి తేజ్ అభిమానులు అతడు త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…