Tag Archives: sons

Anasuya: తన కొడుకుల వల్ల చాలా నష్టపోతున్నా.. అనసూయ బాధలు మామూలుగా లేవుగా?

Anasuya: యాంకర్ అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం యాంకరింగ్ గుడ్ బై చెబుతూ వెండి తెరపై నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా వెండితెర సినిమాలలో బిజీగా ఉండి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె తన కొడుకుల వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

అనసూయ కొడుకులు వల్ల ఎందుకంత ఇబ్బంది పడుతుందనే విషయానికి వస్తే తన కొడుకులు తమ జోబి కాలి చేయకుండా అలాగే బట్టలు వదిలేస్తారని తాను అలాగే వాషింగ్ మిషన్ లోకి వేయడం వల్ల వాషింగ్ మిషన్ తరచూ పాడవుతుందని రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఈమె తన కొడుకులు వల్ల జరిగే నష్టాన్ని తెలియజేశారు.

అలాంటి వాళ్లంటే గౌరవం..

మా ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే జరుగుతుందా అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే డస్ట్ బిన్ కనిపించే వరకు చెత్త కాగితాలను తమ జోబులో పెట్టుకుంటారో అలాంటివారు అంటే నాకు చాలా గౌరవం అంటూ కూడా అనసూయ ఈ సందర్భంగా తన కొడుకుల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇద్దరు కుమారులు ఈ విషయాలు మీకు తెలుసా..? తండ్రికి తగ్గ తనయులు !

తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమారు 3000కు పైగా పాటలు రాశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఎన్నో మధురమైన పాటలు అతడి చేతినుంచి జాలు వారాయి. అతడి మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భౌతికకాయానికి నివాళులర్పించారు సినీ ప్రముఖులు.. ఫిలింఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి చిరు, బాలయ్య, వెంకటేష్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో వాళ్లు మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన మరణం సమయంలో ఆయనకు 66 సంవత్సరాలు.

సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు. తండ్రి స్పూర్తితో ఇద్దరూ కూడా సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా ఒకరు సంగీతం, మరొకరు నటన వైపు కావడం విశేషం. ఇక అతడి పెద్ద కొడుకు యోగేశ్వర్ శర్మ.. సంగీత దర్శకుడిగా ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేశాడు.

ఇక తర్వాత ఎన్నో చిత్రాలకు సంగీతదర్శకుడిగా పని చేశాడు. అందులో ‘రంగు’ అనే సినిమా కూడా ఉంది. ఇక చిన్నబ్బాయి గురించి చెప్పుకుంటే.. అతడు కేక సినిమాతో హీరోగా పరిచయం అయ్యడు. తర్వాత ఎవడు సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా అతడి చిన్న కుమారుడు రాజా.. ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఫిదాలో వరుణ్ తేజ్ కు అన్నగా నటించింది రాజానే.