Tag Archives: sudheer

సుధీర్ పడ్డ కష్టాలు తెలుసుకుని స్టేజిపై ఏడ్చేసిన రష్మి.. వీడియో వైరల్ !

ప్రస్తుతం బుల్లితెర సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సుడిగాలి సుదీర్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఎన్నో తిండి నిద్రలేని రాత్రులు గడిపిన సుదీర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు రాకుండా ఉండవు.

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం 350 ఎపిసోడ్ లోకి ఎంటరైన నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్స్ వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు స్కిట్ రూపంలో చేసి చూపించారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కెవ్వుకార్తిక్ ఇమ్మానియేల్ చేసి అందరి చేత కంటతడి పెట్టించారు. 2012వ సంవత్సరంలో సినిమా కోసం గెటప్ శీను,సుడిగాలి సుధీర్ పడిన కష్టాలను కెవ్వు కార్తీక్ స్కిట్ రూపంలో చూపించారు.

సినిమా అవకాశాలను వెతుకుతూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా మూడు రోజులపాటు తినడానికి తిండి లేక ఆకలితో పస్తులు పడుకున్న సుధీర్ గెటప్ శీను ఒకప్పటి జీవితం అందరి హృదయాలను కలచివేసింది. స్కిట్ రూపంలో సుధీర్ పడిన కష్టాలను తెలుసుకున్న రష్మి కన్నీటి పర్యంతం అయ్యింది.

ఈ స్కిట్ పూర్తయిన తర్వాత కెవ్వు కార్తీక్ రష్మీని తన అభిప్రాయం ఏంటి అని అడగగా అందుకు రష్మి నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు వెలువడలేదు కేవలం ఆమె కంటి నుంచి నీరు మాత్రమే దారలుగా ప్రవహించాయి.రష్మీ సుధీర్ కష్టాలను తెలుసుకొని స్టేజ్ పైనే ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఆర్ యూ వర్జిన్’అంటూ బోల్డ్ క్వశ్చన్ చేసిన హైపర్ ఆది .. ఆ విషయంలో ఫైర్ అయిన రష్మీ..!

బుల్లితెరపై ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో చెప్పుకునేది సుధీర్, హైపర్ ఆది మరియు రాంప్రసాద్. అయితే ఇందులో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచ్ లతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. గత 12 సీజన్ల నుంచి కొనసాగుతున్న ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 13 వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నడుస్తోంది. దీనిలో కామెడీని కూడా జోడించేందుకు సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆదీ, రష్మీ, దీపికాలు ప్రత్యేక ఆకర్షణగా గా నిలుస్తున్నారు. డ్యాన్స్ పర్మామెన్స్ తర్వాత మధ్యలో ఏర్పడే గ్యాప్ లో వీళ్ల సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి యాంకర్ గా ప్రదీప్ తోడై కామెడీని పీక్ కు తీసుకెళ్తుంటారు.

అయితే తాజాగా.. ఢీ ప్రోమో ఒకటి వైరల్ గా మారింది. సాధారణంగా ఇందులో కింగ్స్ తరఫున ఆది, సుధీర్ లు లీడర్లుగా ఉంటారు. క్వీన్స్ తరఫున రష్మీ, దీపికా ఉంటారు. కంటెస్టెంట్లు డ్యాన్స్ పర్మామెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు విన్ అయితే వారు మిగతా టీమ్ లీడర్లకు టాస్క్ ఇస్తుంటారు. ఈ ప్రోమోలో కూడా క్వీన్స్ ఒక డ్యాన్స్ కంటెస్టెంట్ గెలవగా.. కింగ్స్ కు టాస్క్ ఇవ్వాలి.

ఇలా సుధీర్, ఆది టీమ్ టాస్క్ చేయాలని కోరారు రష్మీ టీం. ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ ఈ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అయితే తమకు మూడ్ లేదు.. మేము టాస్క్ చేయమని వెళ్లి సోఫాలో కూర్చున్నాడు ఆది. సుధీర్ అతడిని ఒప్పించే క్రమంలో “ఆర్ యూ వర్జిన్” అంటూ షాకింగ్ క్వచ్చన్ వేశాడు ఆది.

దీంతో సుధీర్ కు నోటి నుంచి మాట రాలేదు. ఆ క్వచ్చన్ కు జడ్జిలు సైతం షాక్ అయ్యారు. ఇలా రెండు సార్లు ఆది అదే ప్రశ్న అడగడంతో సుధీన్ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇదిలా ఉండగా తము ఇచ్చిన టాస్క్ ఎందుకు చేయరని రష్మీ ఆగ్రహంతో గొడవ గొడవ చేసేసింది. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సుధీర్ చేస్తే తప్పులేదు కానీ. నేను చేస్తే మాత్రం తప్పా? అంటూ.. నెటిజన్ల పై ఫైర్ అయిన రష్మి!

తెలుగు బుల్లితెర పై యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూనే బుల్లితెరపై తన అద్భుతమైన యాంకరింగ్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బుల్లితెరపై యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఇద్దరు జోడిగా ఏ కార్యక్రమంలోనైనా సందడి చేశారంటే ఆ కార్యక్రమానికి రేటింగ్స్ అమాంతం పెరిగి పోతాయి.

ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి రష్మి అందులోనే టీమ్ లీడర్ గా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ కు ఎన్నో సార్లు పెళ్లి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇదే బాటలో జబర్దస్త్ కమెడియన్ అను ఇమ్మానియేల్ వర్ష జంట కూడా పెళ్లి చేసిన సంఘటనలు ఉన్నాయి. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ లో భాగంగా వర్ష తన మీద వస్తున్న ట్రోలింగ్ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తనపై వస్తున్నటువంటి ఈ ట్రోల్స్‌ చూసి తన తమ్ముడు ఏంటక్కా ఇది అని అడిగినప్పుడు తట్టుకోలేకపోయానని వర్ష చెప్పగా అందుకు రష్మి రియాక్ట్ అయ్యారు.

ఇండస్ట్రీలో అమ్మాయిలు అబ్బాయిలు సమానం. మా వ్యక్తిగత జీవితాలు మాకు ఉంటాయి.అబ్బాయిలు ఎంతో మంది తో కలిసి చేసిన తప్పు కాదు కానీ అమ్మాయిలు వేరే వాళ్ళతో కలిసి చేస్తే తప్పు అని భావిస్తారు. తాజాగా రష్మీ నటిస్తున్న అటువంటి ఓ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ క్రమంలోనే చాలామంది మీరు సుధీర్ తో కలిసి నటించిన చాలా బాగుంటుందని కామెంట్లో చేశారని ఈ సందర్భంగా రష్మీ తెలిపారు.సుధీర్ ఏ అమ్మాయిలతో కలిసి చేసిన తప్పు కాదు కానీ నేను మాత్రం వేరే వాళ్ళతో చేస్తే తప్పేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరుంధతిగా మారిన పూర్ణ.. భావోద్వేగానికి గురైన గణేష్ మాస్టర్!

ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారయ్యే డ్యాన్సింగ్ రియాల్టీ షో ఢీ13. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిలో జడ్జిలుగా ప్రస్తుతం పూర్ణ, ప్రియమణి, గణేశ్ మాస్టర్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రోమోలో జడ్జిలు, కంటెస్టెంట్లతో పాటు టీమ్ లీడర్లు సైతం అలరించారు. ఎన్టీఆర్ నటించిన జై లవకుశలో యాంకర్ ప్రదీప్ జైగా, అరుంధతిగా పూర్ణ, మగధీర సినిమాలో మిత్రవిందగా ప్రియమణి, ఏమాయ చేశావేలో జెస్సీగా రష్మీ , గణేశ్‌ మాస్టర్‌ జానీగా, సుధీర్ ఇంద్రగా కనిపించి సందడి చేశారు.

ఈ బుధవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో వినోదానికి ఏ మాత్రం కొదవ ఉండదనే చెప్పాలి. అంతే కాకుండా కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ కంటెస్టెంట్లు డ్యాన్సులు అదిరిపోయాయి కూడా. సుధీర్, పూర్ణ కలిగి శృంగార వీర పాటకు వేసిన డ్యాన్స్ అయితే అదో లెవల్ లో ఉంది. నరసింహ సనిమాలోని స్పూఫ్ ను ప్రియమణి, సుధీర్ చేస్తారు.

రజనీకాంత్‌ డైలాగ్స్‌ సుధీర్‌ చెబుతుండగా.. రమ్యకృష్ణగా ప్రియమణి కనిపించింది. దీంతోనే ప్రోమో మొదలవుతుంది. పవర్ స్టార్ నటించిన వకీల్‌సాబ్‌లో జనగణమన పాటకు ఢీ డ్యాన్సర్లు చేసిన ప్రదర్శన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది.

దీంతో అక్కడ జడ్జిలతో సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు. గణేశ్‌ మాస్టర్‌ ఇంకొద్దిగ ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టు 11 న ప్రసారం అయ్యే ఈ షో ప్రతీ ఒక్కరినీ అలరించనుంది. అంతే కాకుండా ప్రతీ ఒక్కరి ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది.