Tag Archives: Telugu Desam Party

Manchu Manoj: తెలుగుదేశం పార్టీలోకి మంచు మనోజ్.. అసలు విషయం లీక్ చేసిన ఎమ్మెల్యే?

Manchu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మంచు మనోజ్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోగా నటించిన అనంతరం గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి మనోజ్ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.

మనోజ్ సినిమాల విషయంలో కాకుండా వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి మనోజ్ అనంతరం తనకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఈయన భూమా మౌనిక రెడ్డితో రెండవ వివాహానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.

అలాగే వీరిద్దరూ కూడా దైవ దర్శనం కోసం కలిసి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరడమే కాకుండా ఇదే ప్రశ్న మనోజ్ కి కూడా ఎదురైంది. ఈ ప్రశ్నకు మనోజ్ సమాధానం చెబుతూ తన జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని మంచి రోజు చూసుకుని తానే చెబుతాను అంటూ సమాధానం చెప్పారు. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గోనే ప్రకాష్ వీరిద్దరి రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Manchu Manoj: ఆ నియోజకవర్గ నుంచి పోటీకి దిగుతున్న మనోజ్…

వీరిద్దరూ ముందుగా పెళ్లి చేసుకోవాలని భావించారు అయితే అప్పట్లో భూమా కుటుంబం వీరి పెళ్లికి అడ్డు చెప్పడంతో వీరిద్దరూ వేరే వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారని ప్రస్తుతం వీరిద్దరూ వారి భాగస్వాములకు విడాకులు ఇచ్చి సహజీవనం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్ చేశారు.ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పిన ఈయన మనోజ్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి కూడా వస్తున్నారంటూ అసలు విషయం వెల్లడించారు.మనోజ్ తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారని ఈయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటూ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ ఈ విషయాన్ని తెలియచేయడంతో ఇది కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

Krishnam Raju: సినిమాలలో రాణిస్తూ కేంద్ర మంత్రిగా సక్సెస్ అయిన కృష్ణంరాజు!

Krishnam Raju: టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యల కారణంగా నేడు తుది విశ్వాస విడిచారు.అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణంరాజు నేడు తెల్లవారుజామున కన్నుమూశారు.

ఇకపోతే ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తన మార్క్ చూపించారు. రాజకీయాలలోకి వచ్చి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకుందాం. కృష్ణంరాజు 1991 వ సంవత్సరంలో రాజకీయాలలోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన అదే ఏడాది నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతి రాజు విజయ్ కుమార్ రాజు అనే వ్యక్తి పై పోటీ చేసి ఓడిపోయారు.

ఈ విధంగా ఓడిపోవడంతో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి 1998లో బిజెపి పార్టీలో చేరారు. కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీకి దిగి విజయం సాధించారు.1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేసి… కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు.

Krishnam Raju: మంచిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణంరాజు..

అనంతరం ఈయన అటల్ బీహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక కొంతకాలం పాటు రాజకీయాలకు దూరమైనటువంటి ఈయన 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. అయితే ఈ పార్టీ కూడా గెలవకపోవడంతో ఈయన తిరిగి బీజేపీలో చేరారు. ఇలా బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేదు.

Mohan Babu: రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు.. ఆ నియోజకవర్గ నుంచి పోటీ!

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోయారు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఈయన అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి తన సేవలను అందించారు.

ఈయన సేవలను గుర్తించిన అధిష్టానం ఈయనని ఏకంగా రాజ్యసభ సభ్యునిగా గెలిపించారు. అన్నగారి మరణం అనంతరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకోవడంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో ఈయనతో బంధుత్వం ఏర్పడటమే కాకుండా వైయస్సార్ కి మద్దతుగా నిలబడ్డారు.

ఇక ప్రస్తుతం జగన్ స్థాపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు గత కొద్దిరోజులుగా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఈయన తిరిగి రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారని, తిరిగి తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలిపే సూచనలు ఉన్నాయంటూ పలువురు భావిస్తున్నారు. తిరుపతి సమీపంలో మోహన్ బాబు నిర్మించిన సాయిబాబా ఆలయ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోహన్ బాబు కలిశారు.

Mohan Babu: జగన్ పై అసంతృప్తి కారణమా…

ఇలా వీరిద్దరి భేటీ కన్నా ముందుగా మోహన్ బాబు టిడిపి నేతలతో కలిసి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టిడిపి పార్టీ తరపున మోహన్ బాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ వ్యవహరి శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.