Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోయారు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఈయన అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి తన సేవలను అందించారు.
ఈయన సేవలను గుర్తించిన అధిష్టానం ఈయనని ఏకంగా రాజ్యసభ సభ్యునిగా గెలిపించారు. అన్నగారి మరణం అనంతరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకోవడంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో ఈయనతో బంధుత్వం ఏర్పడటమే కాకుండా వైయస్సార్ కి మద్దతుగా నిలబడ్డారు.
ఇక ప్రస్తుతం జగన్ స్థాపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు గత కొద్దిరోజులుగా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఈయన తిరిగి రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారని, తిరిగి తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలిపే సూచనలు ఉన్నాయంటూ పలువురు భావిస్తున్నారు. తిరుపతి సమీపంలో మోహన్ బాబు నిర్మించిన సాయిబాబా ఆలయ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోహన్ బాబు కలిశారు.
ఇలా వీరిద్దరి భేటీ కన్నా ముందుగా మోహన్ బాబు టిడిపి నేతలతో కలిసి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టిడిపి పార్టీ తరపున మోహన్ బాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ వ్యవహరి శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…