Tag Archives: thank you

Aishwarya -Abhishek Bachchan: విడాకులు తీసుకోబోతున్న ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న న్యూస్?

Aishwarya -Abhishek Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు అమితాబ్ బచ్చన్. ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అభిషేక్ బచ్చన్. అభిషేక్ అమితాబ్ అంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయినా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి అభిషేక్ మాజీ ప్రపంచ సుందరి ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ ను 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

ఇలా ఐశ్వర్యను వివాహం చేసుకున్న తరువాత అభిషేక్ క్రేజ్ మరింత పెరిగింది.ఇక సాధారణంగా సెలబ్రిటీలు అంటేనే వారి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఐశ్వర్య అభిషేక్ గురించి గతంలో పెద్ద ఎత్తున విడాకుల గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే విడాకుల వార్తలపై స్పందించిన అభిషేక్ బచ్చన్ గతంలో ఒక ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నేను విడాకులు తీసుకోబోతున్నానట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు.విడాకులు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అయితే తనకు రెండో పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే థాంక్యూ అంటూ ఈయన విడాకుల వార్తలపై చేసిన ట్వీట్ గతంలో వైరల్ అయింది.అయితే తాజాగా మరోసారి ఈ విడాకుల గురించి వార్తలు రావడంతో ఈ విషయం స్పందించారు.

Aishwarya -Abhishek Bachchan: మా ఇద్దరి మధ్య ఎలాంటిదో మాకు తెలుసు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నా జీవితంలో ఎలా ముందుకు ప్రయాణం చేయాలో నాకు తెలుసు మా విషయంలో మూడో వ్యక్తి సలహాలు సూచనలు అవసరం లేదు. నేను ఐశ్వర్య ను ఎలా ప్రేమిస్తానో తనకు తెలుసు…తను నన్ను ఎలా ప్రేమిస్తుందో నాకు తెలుసు అంటూ ఈ సందర్భంగా ఈయన విడాకులు గురించి వస్తున్న వార్తలపై మరోసారి స్పందించారు. ఇక 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఆరాధ్య అనే ఒక కుమార్తె కూడా కలదు.

Dil Raju: డైరెక్టర్ తేజ వల్ల కోట్లలో నష్టపోయిన దిల్ రాజు… అసలేమైందంటే?

Dil Raju: టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట డిస్ట్రిబ్యూటర్ తన కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందాడు. దిల్ రాజు నిర్మించిన సినిమాలోని 80% సినిమాలు మంచి విజయం సాధించి దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం దిల్ రాజు నిర్మించిన సినిమాల వల్ల భారీ నష్టం ఎదుర్కోవల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ముఖ్యపాత్ర పోషిస్తారు..

ఒక సినిమా నిర్మించటానికి నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే ఆ సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా కూడా నిర్మాతలదే భాధ్యత ఉంటుంది. సినిమా హిట్ అయితే లాభాలు తీసుకున్నట్లే సినిమా ప్లాప్ అయినా కూడా వాటి నష్టాలను భరించాల్సి వస్తుంది. అయితే సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజుకి చాలా అనుభవం ఉంది. సినిమా స్టోరీ విన్న తర్వాత దిల్ రాజు ఆ సినిమా గురించి అంచనా వేసి మరి నిర్మాణ పనులు చేపడుతారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో దిల్ రాజు అంచనాలు తప్పడం వల్ల ఆయన నిర్మించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

తేజ దర్శకత్వం వహించిన ఒక సినిమాకి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం వల్ల దిల్ రాజు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన ” జై ” సినిమా 2004లో విడుదలై నిరాశపరిచింది. ఈ సినిమా నైజాం హక్కులు దిల్ రాజు రూ.2.25 కోట్లు పెట్టి దక్కించుకున్నారు.

Dil Raju: ఆర్య నష్టాల నుంచి బయట పడేసింది….

ఆ సినిమా ఫ్లాప్ అవటంతో అందులో సగం డబ్బులు కూడ వసులు కాలేదు. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం వల్ల దిల్ రాజు దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టపోయారట. అయితే అదే ఏడాది వచ్చిన ఆర్య సినిమా వల్ల ఆ నష్టం భర్తీ అయినట్లు దిల్ రాజు ఒక సందర్భంలో వెల్లడించాడు. ఇక ఇటీవల నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మించిన థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని దిల్ రాజు కి భారీ నష్టాలను మిగిల్చింది.

Tammareddy Bharadwaj: ఆరోజు దిల్ రాజు ఇంటికి వెళ్లి ఎందుకు అడుక్కున్నావ్..? హీరో నిఖిల్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి

Tammareddy Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా పై స్పందిస్తూ పెద్ద ఎత్తున హీరో నిఖిల్ పై ఫైర్ అయ్యారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ తన సినిమా విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని థియేటర్లు కూడా దొరక్కుండా చేస్తున్నారంటూ పరోక్షంగా దిల్ రాజు గురించి ఈయన ఆరోపణలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయంపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ నిఖిల్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ హీరో నిఖిల్ సినిమా విడుదలకు థియేటర్స్ దొరకడం లేదని ముసలి కన్నీళ్లు కార్చి సినిమా హిట్ అవ్వగానే దిల్ రాజుని సక్సెస్ మీట్ కి పిలవడం ఆయన మాట్లాడుతూ చేసిందంతా మీడియా అంటూ మీడియాపై మండిపడుతున్న సమయంలో నిఖిల్ మాత్రం వెనకనే ఉండి నవ్వుతున్నారే తప్ప ఆ రోజు నువ్వు నా సినిమాకి అడ్డుపడలేదా అని దిల్ రాజు గారిని ప్రశ్నించలేదు.

నిజంగానే నీ సినిమాకి దిల్ రాజుగారు అడ్డుపడి ఉంటే ఆరోజు ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ తీసుకొని మీరు నా సినిమాకు అడ్డుపడలేదా అని అడగాల్సింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా ఫ్లాప్ అయితే మరొక విధంగా మాట్లాడటం మానుకోవాలి. అయినా దిల్ రాజు గారి ఇంటికి వెళ్లి అడుక్కోవాల్సిన అవసరం నీకేంటి? హీరో హీరో పనులు మాత్రమే చూసుకోవాలి డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమాలో నటించలేదు కదా…మాచర్ల నియోజకవర్గం సినిమాకి పోటీగా వచ్చిన నీవు థాంక్యూ సినిమాకి ఎందుకు పోటీగా రాలేకపోయావు అంత ధైర్యం నీకు లేదా? అంటూ తమ్మారెడ్డి నిఖిల్ పై ఫైర్ అయ్యారు.

Tammareddy Bharadwaj: డబ్బు కోసమే సినిమాలు చేస్తారు…

సినిమా ఫ్లాప్ అయితే ముసలి కన్నీళ్లుకార్చడం హిట్ అయితే కాలర్ ఎగరేయడం వంటివి మానుకోవాలి అయినా నువ్వు హీరోగా డబ్బు తీసుకోకుండా సినిమాలు చేయలేదు కదా డబ్బు కోసమే సినిమాలు చేశావు కానీ దేశాన్ని ఉద్ధరించడం కోసం సినిమాలు చేయలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన నిఖిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వ్యాఖ్యలపై నిఖిల్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ స్టోరీ ఇదేనా.. చాలా డిఫరెంట్ గా ఉందే..!!

టాలీవుడ్ లో ఇటీవల మజిలీ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు నాగచైతన్య.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ సరసన సమంత హీరోయిన్ గా నటించగా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..ఇక ప్రస్తుతం క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోర్ సినిమా షూటింగ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది..

ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య.

ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ప్రకారం ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు.

ఇండియాలో తన కుటుంబ సభ్యులను వెదికేందుకు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ సినిమా అంటున్నారు. విక్రమ్ కుమార్ కథలు అన్ని కూడా చాలా విభిన్నంగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని అంటున్నారు. ఇక ‘థాంక్యూ’ సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్నాడు విక్రమ్.ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం సిద్ధం అవుతోంది..!!