Tag Archives: vaishnav tej

Sree Leela: డిజే టిల్లు సీక్వెల్ కి హ్యాండ్ ఇచ్చిన శ్రీ లీల.. కారణం ఏంటబ్బా?

Sree Leela:శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు డిజే టిల్లు సీక్వెల్ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు.

సిద్దు జొన్నలగడ్డ నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా డీజే టిల్లు 2 సినిమాని తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇందులో నేహా శెట్టికి బదులు పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీలాను ఎంపిక చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన రెండు రోజులకే చిత్ర బృందానికి శ్రీ లీల గట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో తాను నటించలేనని ఈమె ఈ సినిమాకి గుడ్ బై చెప్పినట్టు సమాచారం.ఈ సినిమా నుంచి ఈమె తప్పుకోవడానికి సరైన కారణం తెలియక పోయినప్పటికీ ఇలా శ్రీ లీలా మధ్యలో వెళ్లిపోవడంతో చిత్ర బృందం మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.

Sree Leela: వరుస సినిమాలతో బిజీగా మారిన నటి..

ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే మారుతి ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా అందులో ఒకరిగా ఈమె అవకాశం అందుకున్నట్టు తెలుస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీ లీల డిజె టిల్లు సీక్వెల్ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

Konda Polam: వెండితెరపై హిట్ కొట్టలేకపోయినా.. ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాహీరో?

Konda Polam: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ మెగా హీరోకి వరుసగా అవకాశాలు వచ్చాయి.

Konda Polam: వెండితెరపై హిట్ కొట్టలేకపోయినా.. ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాహీరో?

ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే నవల ఆధారంగా కొండపొలం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా ద్వారా గొర్రెలకాపరులు అడవిలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనే విషయాలను దర్శకుడు ఎంతో అద్భుతంగా చూపించారు.

Konda Polam: వెండితెరపై హిట్ కొట్టలేకపోయినా.. ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాహీరో?

గొర్రెలకాపరులుగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. దీంతో వైష్ణవ్ రెండవ సినిమానే ఫ్లాప్ గా నిలిచింది.

బుల్లితెర పై హిట్ కొట్టాడుగా

ఇలా థియేటర్ లో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా జనవరి 2వ తేదీ స్మాల్ స్క్రీన్ పై ప్రసారం అయింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఐదు కోట్ల రూపాయలకు స్టార్ మా దక్కించుకుంది. ఈ క్రమంలోనే జనవరి 2వ తేదీ ప్రసారమైన ఈ సినిమా ఏకంగా 12. 34 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా 12 కి పైన రేటింగ్స్ దక్కించుకోవడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లడమే కాకుండా స్టార్ మాకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది.ఏది ఏమైనా థియేటర్ లో ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

కొండపొలం సినిమాపై పవన్ మామ ఇలా అన్నాడు.. హీరో వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతోనే తనకున్న టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దీని తర్వాత అతడు వెంటనే ఒప్పుకున్న మరో బిగ్ ప్రాజెక్ట్ ‘కొండపొలం’ సినిమా.

దీనిని ప్రముఖ దర్శకుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. దీనిని సన్నపురెడ్డి వెంట రామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ చిత్రంగా దర్శకుడు తెలిపాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఈ సినమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉండగా.. వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలోని ‘నీ కళ్లు నీలి సముద్రం’అనే సాంగ్ లో తాను చేసిన నటనకు మెచ్చి తనకు ఈ అవకాశాన్ని దర్శకుడు ఇచ్చాడని అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కథను తాను మొదట విన్నానని.. దానిని తన మామ అయిన పవన్ కళ్యాణ్ కు కూడా చెప్పానని.. అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తాను కూడా ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి వహిస్తున్నాడు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ క‌నిపించ‌నున్నాడు. అడవికి వెళ్లి అక్కడ తన కుటుంబాన్ని , తన గొర్రెలను క్రూరమైన జంతువుల నుంచి ఎలా కపాడుతాడనేది ఈ సినిమా అని దర్శకుడు క్రిష్ పేర్కొన్నాడు.

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యేది ఆరోజే?

“ఉప్పెన” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరొక మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండస్ట్రీలో వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వైష్ణవ్ తన రెండవ సినిమాను క్రిష్ దర్శకత్వంలో నటించారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ మెగా హీరో సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ లేకపోయినప్పటికీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని తెలుస్తుంది. షూటింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారాన్ని దర్శకుడు క్రిష్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసే తేదీ సమయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం క్రిష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సూర్యాస్తమయ సమయంలో హీరో వైష్ణవ తేజ్ తో పాటు ఇతర గ్రామీణలు, పశువులు గొర్రెలు, అడవిలో నడుస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ నెల 20వ తేదీన ఉదయం 10:15 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ తెలియజేశారు. ఇక పోతే ఈ సినిమాకు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ చేయగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన “కొండల పొలం” అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ క్రిష్ ఇదివరకే తెలియజేశారు.

ఉప్పెన సినిమా కోసం ఎలాంటి రోజు ఎంచుకున్నారో తెలిస్తే?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా “ఉప్పెన”. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి తొలిసారిగా పరిచయమైంది. దాదాపు ఈ సినిమా పూర్తి కాగా.. ఈ సినిమాలో పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా గత ఏడాది విడుదల కానుండగా లాక్‌డౌన్‌ వల్ల మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా గురించి అభిమానులు ఎదురు చూడగా.. పలుమార్లు ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కారణం ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని కోరారు.

అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేయగా అది కూడా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయగా.. అది కూడా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లవ్ స్టోరీ సంబంధించింది కాబట్టి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే న విడుదల చేస్తారని అనుకోగా.. అదే డేట్ కి ఫిక్స్ చేశారని చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాకుండా వైష్ణవ్ తేజ్ మరో సినిమా క్రిష్ దర్శకత్వంలో నటించగా.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. కాగా వైష్ణవ్ తేజ్ కు ఈ రెండు సినిమాలు మంచి హిట్ ను అందిస్తాయని అర్థమవుతుంది.