“ఉప్పెన” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరొక మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండస్ట్రీలో వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వైష్ణవ్ తన రెండవ సినిమాను క్రిష్ దర్శకత్వంలో నటించారు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ మెగా హీరో సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ లేకపోయినప్పటికీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని తెలుస్తుంది. షూటింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారాన్ని దర్శకుడు క్రిష్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసే తేదీ సమయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం క్రిష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సూర్యాస్తమయ సమయంలో హీరో వైష్ణవ తేజ్ తో పాటు ఇతర గ్రామీణలు, పశువులు గొర్రెలు, అడవిలో నడుస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ నెల 20వ తేదీన ఉదయం 10:15 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ తెలియజేశారు. ఇక పోతే ఈ సినిమాకు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ చేయగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన “కొండల పొలం” అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ క్రిష్ ఇదివరకే తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…