Tag Archives: Vijay sai Reddy

Alekhya Reddy: చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పోస్ట్ వైరల్!

Alekhya Reddy: నందమూరి వారసుడు నందమూరి తారక రత్న ఇటీవల మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రకి మద్దతుగా యువగళం పాదయాత్రలో పాల్గొని మొదటి రోజే గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులో చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడిన తారకరత్న చివరికి తుది శ్వాస విడిచాడు.

తారకరత్న మరణం ఆయన భార్య ఆలేఖ రెడ్డికి తీరని లోటుని మిగిల్చింది. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డి జీవితం శూన్యంలో మారిపోయింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న వీరిద్దరిని ఇరు కుటుంబాలు దూరం పెట్టాయి. ఈ క్రమంలో అందరి ప్రేమాభిమానాలకు దూరమైన వీరిద్దరూ ఒకరికి ఒకరు ప్రాణంగా జీవించారు. అయితే తారకరత్న హఠాత్మరణంతో అలేఖ్య రెడ్డి జీవితంలో శూన్యం మిగిలింది.

తారకరత్న ఈ లోకంలో లేడనే విషయాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతోంది . ఈ క్రమంలో తరచూ తారకరత్ననే తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తారకరత్నని తలుచుకుంటూ భర్త మీద తనకి ఉన్న ప్రేమని అలేఖ్య తెలియజేస్తూ పోస్ట్ షేర్ చేసింది.

Alekhya Reddy: ఈ జన్మకు నా జీవితం ఇంతే…

ఈ క్రమంలో ” ఈ జన్మకు నువ్వే నా ప్రపంచం..నా జీవితం అంతా నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా…నా శ్వాస ఉన్నంత వరకు కూడా నిన్నే ప్రేమిస్తుంటాను ” అని అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తారకరత్న తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్నని తలచుకుంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అంతే కాకుండా అలేఖ్య రెడ్డికి కూడా ధైర్యం చెబుతున్నారు.

Vijay Sai Reddy: తారక రత్న ఆరోగ్య విషయంలో బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి…?

Vijay Sai Reddy: నందమూరి వారసుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండె పోటుతో అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్నటి వరకు అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవటంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన పెరిగిపోయింది. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఇక ఆయన ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించాడు.

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల పరామర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కూతురు అలేఖ్యరెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నాడు. ఇలా నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డికి బంధుత్వం ఏర్పడింది. అయితే అలేఖ్యరెడ్డిని తారకరత్న వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబంలో విభేదాలు మొదలై తారకరత్నని దూరం పెట్టారు. వీరి వివాహం తర్వాత కొంతకాలానికి మళ్లీ కుటుంబ సభ్యులందరూ కలిసిపోయారు.

ఇక ఇటీవల పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అనారోగ్యం పాలవటంతో స్వయంగా బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్న ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవల విజయసాయిరెడ్డి బెంగళూరుకు చేరుకొని డాక్టర్లను సంప్రదించి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలియజేశారు.

Vijay Sai Reddy: కోలుకుంటున్న తారకరత్న…

తారకరత్న గుండె పనితీరు మెరుగు పడటమే కాకుండా రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుందని, తొందర్లోనే తారకరత్న కోలుకుంటాడని విజయసాయిరెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా తారకరత్నకు దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకుంటున్న బాలకృష్ణకు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశాడు.

Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

Bandla Ganesh: వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఇదే విషయం పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్స్ సంచలనంగా మారాయి.

Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు విజయ సాయి రెడ్డి. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ లాంటి ప్రత్యర్థులు చేసే ఆరోపణలపై స్పందిస్తూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ రాష్ట్రంలోని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి చర్యలు ఉంటున్నాయని అనడంతో ఆ విషయంపై స్పందించిన విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ..ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు,అంత ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా.. అంటూ విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే బండ్ల గణేష్ విజయసాయి రెడ్డి పై ట్వీట్ చేస్తూ..

నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు ….

మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి… చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు అని బండ్ల గణేష్ అన్నారు.. నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ బండ్ల ట్వీట్ చేశారు. ఈ విషయంపై విజయసాయి రెడ్డి ఆ విధంగా ఊర కుక్క అంటూ బండ్ల గణేష్ పై ట్వీట్ చేయడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు విచారణ ఈ నెల 16కు వాయిదా!

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని సిబిఐ మెమో దాఖలు చేసింది. అటు
కౌంటర్ దాఖలుకు విజయసాయి రెడ్డి గడువు కోరిన నేపథ్యం లో తదుపరి విచారణ ఈనెల16 కి వాయిదా వేసింది.

కాగా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేసిన సంగతి నేపథ్యంలో సిబిఐ కోర్టు లో విచారణ జరుగుతోంది.