Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!
Bandla Ganesh: వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఇదే విషయం పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్స్ సంచలనంగా మారాయి.
ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు విజయ సాయి రెడ్డి. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ లాంటి ప్రత్యర్థులు చేసే ఆరోపణలపై స్పందిస్తూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ రాష్ట్రంలోని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి చర్యలు ఉంటున్నాయని అనడంతో ఆ విషయంపై స్పందించిన విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ..ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు,అంత ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా.. అంటూ విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే బండ్ల గణేష్ విజయసాయి రెడ్డి పై ట్వీట్ చేస్తూ..
మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి… చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు అని బండ్ల గణేష్ అన్నారు.. నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ బండ్ల ట్వీట్ చేశారు. ఈ విషయంపై విజయసాయి రెడ్డి ఆ విధంగా ఊర కుక్క అంటూ బండ్ల గణేష్ పై ట్వీట్ చేయడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…