బాలకృష్ణకు నో చెప్పి చిరుకి ఓకే చెప్పిన తమన్నా.. కారణం ఏమిటంటే?

తమన్నా భాటియా ఈ పేరు వినగానే ముందుగా టక్కున గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. తమన్నా తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా.

తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఈ మధ్య కాలంలో తమన్నా సినిమాలు,వెబ్ సిరీస్ అని తేడా లేకుండా వరుసగా నటిస్తూ దూసుకుపోతోంది.ఇటీవలె ఆమె సీటిమార్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో గోపీచంద్ హీరోగా నటించాడు.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ హీరో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమాకి మొదట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేనని చెప్పిందట. దాంతో శ్రుతిహాసన్ తో ఉన్న పరిచయం కారణంగా, గోపీచంద్ ఆమెను ఒప్పించాడని అంటున్నారు.

అలా బాలయ్య సినిమాలో శ్రుతిహాసన్ ఎంట్రీ ఖరారైపోయింది. అయితే ప్రస్తుతం శ్రుతిహాసన్ ప్రభాస్ సరసన నాయికగా సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్ సినిమా కోసం ముందుగా శ్రుతిని అడిగితే, వాళ్లు అడిగిన డేట్లు ఖాళీ లేని కారణంగా ఆమె చేయలేనని చెప్పిందట. ఆమె నో చెప్పిన తరువాతనే తమన్నాను ఎంపిక చేశారట. అలా ఒకరు నో చెప్పిన సినిమాకి మరొకరు ఎస్ చెప్పారన్న మాట.