General News

ప్రియురాలి ఇంట్లో చేపల పులుసు తిన్నాడు.. దారుణంగా?

ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో తనతో పెళ్లికి తన ప్రేయసి కుటుంబీకులు ఒప్పుకోలేదు. తర్వాత ప్రియుడు నచ్చజెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయి తరపు వాళ్ళు నిశ్చితార్థ వేడుకలను నిర్వహించారు. అయితే అత్తగారి ఇంటికి వెళ్ళిన అల్లుడికి అతిధి మర్యాదలు ఎంతో చక్కగా చేశారు.అల్లుడొచ్చాడు అని చేపల పులుసు వండి ప్రియురాలు ఎంతో ప్రేమగా తినిపించడం తో ప్రియుడు ఎంతో మురిసిపోయాడు. చేపల పులుసు తిన్న తర్వాత వాంతులు చేసుకుని మరణించాడు. అతని మరణం వెనుక కారణం ఎవరు? ఇది సహజ మరణమేనా లేక హత్యాయత్నం? అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని మున్నార్‌కు చెంది నిషాంత్ (30) చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తరపు ఇంట్లో తెలియగానే వీరి పెళ్లికి నిరాకరించారు.నిశాంత్ బలవంతంగా ఒప్పించడంతో పెళ్ళికి ఒప్పుకొని నిశ్చితార్థం కూడా జరిపించారు.

మే 17న వీరు పెళ్లి కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది.ఈ క్రమంలోనే నిషాంత్ పనిచేస్తున్న ఆఫీసుకు సెలవులు ప్రకటించడంతో అతను కేరళలో లాక్ డౌన్ ఉన్న కారణంగా కాబోయే తన అత్త వారి ఇంటికి వెళ్ళాడు. అల్లుడొచ్చాడని అత్తింటివారు అల్లుడికి చేపలు వండి భోజనం పెట్టారు.భోజనం తిన్న కాసేపటికే నిషాంత్ కి వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే నిశాంత్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

చేపల పులుసు తిన్న కుటుంబ సభ్యులందరికీ ఏమీ కాకుండా నిశాంత్ ఒక్కడికే వాంతులు కావడంతో నిశాంత్ కుటుంబ సభ్యులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిశాంత్ పై హత్యా యత్నం జరిగిందా లేక సహజ మరణమా అనే విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago