Tarakaratna Daughter: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈయన మరణించినప్పటికీ ఈయన కుటుంబ సభ్యులు తన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తారకరత్న ఇలా ప్రేమించిన అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
ఇలా తన భర్త జ్ఞాపకాలనుంచి బయటపడలేనటువంటి అలేఖ్య తన పెద్ద కుమార్తె నిషిక తరచూ తారకరత్న గురించి తనతో వారికి ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.తాజాగా తారకరత్న కుమార్తె నిషిక తన తండ్రితో కలిసి ఆడుకున్నటువంటి చివరి క్షణాలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న హిందూపురం వెళ్లే ముందు తనతో కలిసి వీడియో గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన వీడియోని నిషిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హిందూపురం వెళ్లడానికి ముందు తన తండ్రి తనతో కలిసి ఆడిన గేమ్ అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు మిస్ యు సో మచ్ తారక్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈయన లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో గుండెపోటుకు గురయ్యారు. ఇలా 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసింది.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…