Tarakaratna Daughter: తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోని షేర్ చేసిన తారకరత్న కుమార్తె… వైరల్ అవుతున్న వీడియో!

Tarakaratna Daughter: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈయన మరణించినప్పటికీ ఈయన కుటుంబ సభ్యులు తన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తారకరత్న ఇలా ప్రేమించిన అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

ఇలా తన భర్త జ్ఞాపకాలనుంచి బయటపడలేనటువంటి అలేఖ్య తన పెద్ద కుమార్తె నిషిక తరచూ తారకరత్న గురించి తనతో వారికి ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.తాజాగా తారకరత్న కుమార్తె నిషిక తన తండ్రితో కలిసి ఆడుకున్నటువంటి చివరి క్షణాలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న హిందూపురం వెళ్లే ముందు తనతో కలిసి వీడియో గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన వీడియోని నిషిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హిందూపురం వెళ్లడానికి ముందు తన తండ్రి తనతో కలిసి ఆడిన గేమ్ అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.

Tarakaratna Daughter: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నిషికా…

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు మిస్ యు సో మచ్ తారక్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈయన లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో గుండెపోటుకు గురయ్యారు. ఇలా 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసింది.