Teacher Christina Formella left new husband in the dark about twisted relationship with student
అమెరికాలోని చికాగో నగరంలో ఓ మహిళా టీచర్పై నిబంధనలు తలకిందులైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డౌనర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్కి చెందిన 30 ఏళ్ల క్రిస్టినా ఫోర్మెల్లా అనే టీచర్ తనే బోధించే 15 ఏళ్ల విద్యార్థితో సుమారు 50 సార్లు శృంగార సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అక్కడి విద్యా వ్యవస్థను షేక్ చేసింది.
ఫోన్లో అసభ్య సందేశాలతో బయటపడిన సత్యం
విద్యార్థి ఫోన్ను తన తల్లి చూసినప్పుడు, అందులో టీచర్ పంపిన అసభ్యకరమైన మెసేజ్లు కనిపించాయి. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో క్రిస్టినా ఫోర్మెల్లాను అదుపులోకి తీసుకుని, స్కూల్ నుంచి తాత్కాలికంగా తొలగించారు.
టీచర్పై తీవ్ర అభియోగాలు.. లైంగిక దాడి, నేరపూరిత శృంగారం
మేరకు క్రిస్టినాపై కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా మరో 52 అభియోగాలు కూడా మోపారు. ఈ కేసు అమెరికాలోని చట్టవ్యవస్థను, సమాజాన్ని కలకలం చేయడం ఖాయం.
కోర్టులోని నాటకీయ పరిణామాలు
కేసు విచారణలో క్రిస్టినా తన భర్తతో కలిసి కోర్టుకు హాజరైంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. విద్యార్థితో శృంగార సంబంధం లేదని కోర్టులో స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, విద్యార్థి నివసించే ప్రదేశానికి 5000 ఫీట్ల దూరంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. కానీ క్రిస్టినా, తాము ఒకే వీధిలో ఉంటామని, ఆ దూరాన్ని 2500 ఫీట్లకు తగ్గించాలని మరో కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
దోషిగా తేలితే 60 ఏళ్ల జైలు శిక్ష?
ఈ కేసులో ఆమెపై ఆరోపణలు రుజువైతే, క్రిస్టినా ఫోర్మెల్లాకు 60 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనగా ఈ కేసు పరిగణించబడుతోంది.
మానవ సంబంధాల్లో నైతిక విలువలు, విద్యా సంస్థల నిబద్ధత గురించి చర్చకు దారి తీస్తున్న ఈ కేసు ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన గురువు చేతిలోనే ఇలాంటి ఘటనలు జరగడం దిగ్భ్రాంతికరం. ఇక న్యాయస్థాన తీర్పు ఈ వ్యవహారానికి ఎటువంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…