Sachin Joshi: సచిన్ జోషికి షాక్ ఇచ్చిన ఈడీ..! కోట్ల ఆస్తులు జప్తు..!
Sachin Joshi: సచిన్ జోషి టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో అనేక సినిమాల్లో హీరో కనిపించారు. దీంతోపాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు.
గతంలో విజయమాల్య సంబంధించిన విల్లా కూడా కొనుగోలు చేసి వార్తల్లో కూడా నిలిచారు. సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించారు. మ్యూజికల్ గా ఆ సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది.
ఇదిలా ఉండగా.. ఒరేయ్ పండు, నిన్ను చూడక నేనుండలేను. జాక్ పాట్ నీ జతగా నేనుండాలి సినిమాల్లో నటించారు. చివరగా 2017 లో వీడెవడు సినిమాలు కనిపించారు. గతంలో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ లు నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోనూ కనిపించారు. ఆ సమయంలో టాలీవుడ్ తరపున క్రికెట్ ఆడారు.
అయితే తాజాగా సచిన్ జోషి ఓ వివాదంలో ఇరుక్కున్నారు. సచిన్ జోషి సంబంధించి ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కొన్ని కోట్ల రూపాయలను జప్తు చేయడం చర్చకు దారి తీసింది. శనివారం ఈడీ రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ. 330 కోట్లు విలువైన ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషి కి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవి. ఎస్ ఆర్ ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కిందటేడాది సచిన్ జోషి అరెస్టయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…