Chiranjeevi: రాజకీయ ప్రవేశంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..! షాక్ లో అభిమానులు...!
Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ ధరల వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల పలువురు నటులు, అటు ప్రభుత్వం నుంచి మంత్రుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్ల విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈసమస్యలకు త్వరలోనే పరిష్కారం అవుతుందని.. సీఎం జగన్ చెప్పారని చిరంజీవి వెల్లడించారు.
అంతవరకు అందరూ సంయమనం పాటించాలని.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. త్వరలోనే ఓ టీమ్ గా వచ్చి సీఎం గారిని కలుస్తాం అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, జగన్ భేటీ సరికొత్త చర్చకు దారి తీసింది.
రాజ్యసభకు చిరంజీవిని వైసీపీ తరుపున పంపుతారనే చర్చ జరుగుతోంది. తాజాగా రాజ్యసభలో కొంతమంది నాయకుల పదవీకాలం దగ్గర పడింది. అదే సమయంలో టాలీవుడ్ సమస్యలు చర్చించేందుకు చిరంజీవి, సీఎం నివాసానికి వెళ్లారు. ఇదే సమయంలో రాజ్యసభ విషయం చర్చకు వచ్చిందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సమస్యలపై చర్చించే వారే అయితే ఒక్కరే ఎందుకు వెళ్తారు అనే పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకేదైనా విషయం గురించి చర్చించేందుకు వన్ టూ వన్ మీటింగ్ జరిగిందంటూ తమదైన రీతిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ పై చిరంజీవి స్పందించారు. ”తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్లీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా చిరంజీవి వెల్లడించారు .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…