Chiranjeevi: మెగస్టార్ చిరంజీవికి పెద్ద సమస్యే వచ్చిపడింది..! పరిష్కారం ఏంటి..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మీడియాకు చాలా దూరంగానే ఉంటున్నారు. సందర్భం వస్తే కానీ.. మీడియాతో పెద్దగా మాట్లాడటం లేదు. అది కూడా తాను చెప్పాల్సింది మాత్రమే చెబుతున్నారు తప్పితే.. మీడియా అడిగే కొన్ని ప్రశ్నలను దాటవేస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం మీడియా పట్ల కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట ఓ ట్రెండ్ టాపిక్ ట్విటర్ లోకి తీసుకువచ్చి, ఆ మాటకు ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి డిజిటల్ మాధ్యమాల్లో ట్రోల్ చేయిస్తున్నారు. గతంలో కూడా మీడియా వాళ్లకు మనం టార్గెట్ కాకూడదని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.
అయితే ఈ మధ్య సెలబ్రెటీలు మీడియా టార్గెట్ అవుతున్నారు. సహజంగా సెటబ్రెటీల వివాదాలు, జీవితంపై సాాధారణ ప్రజలకు ఆసక్తి ఉంటుంది. అందుకే ఎప్పడు సెలబ్రెటీ వార్తలు వచ్చినా.. రీడర్లను, వ్యూయర్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. దీంతో చాలా మీడియా సంస్థలు వారిపై స్టోరీలు చేయడం.. కాంట్రవర్సీ న్యూస్ లను ఎపిసోడ్లకు ఎపిపోడ్లు రన్ చేయడం చూస్తూనే ఉన్నాం.
దీంతో ఈ మధ్య సెలబ్రెటీలు దూరంగానే ఉంటున్నారు మీడియాకు. కనీసం స్టూడియోలకు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏ మాట మాట్లాడితే ఏ తంటా వస్తుందో అని చివరకు మీడియాకు మొహం చూపించడం లేదు. చివరకు సోషల్ మీడియాలో వచ్చే చిన్న లీక్ ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పుంఖాను పుంఖాలు వార్తలు రాసేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే చిరంజీవి వంటి పెద్దల మనసును కలవరపెడుతోంది. అలా అని పూర్తిగా మీడియాను ఆయన దూరం పెట్టలేరు. ఒకవేళ ఎవరినైనా పిలిపించి మాట్లాడితే ఆ ఒక్క సందర్భంలో చెప్పిన ఆయన మాట్లాడిన మంచి మాటలను వదిలేసి.. కాంట్రవర్సీలను వెతుకుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…