Sampath Raj:అప్పటి వరకూ ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించిన రాని గుర్తింపు కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా ద్వారా గుర్తింపు వచ్చిందని నటుడు సంపత్ రాజ్ తెలిపారు.మిర్చి సినిమా ద్వారా విలన్ పాత్రలో అందరికీ సుపరిచితమైన సంపత్ రాజ్ అనంతరం ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో విలన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సంపత్ రాజ్ మాట్లాడుతూ… తన ఫ్యామిలీ గురించి తన కెరీర్ గురించి ఆశక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక నటి శరణ్య సంపత్ రాజ్ భార్యాభర్తలు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో షికార్లు కొట్టింది.
ఈ కార్యక్రమం ద్వారా సంపత్ రాజ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరణ్య ఫ్యామిలీ,మా ఫ్యామిలీ చాలా క్లోజ్ అని, తన భర్త నేను మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని తెలిపారు. అయితే మేమిద్దరం కలిసి ఒక సినిమాలో భార్యాభర్తలుగా నటించామని అదే విషయాన్ని కొందరు మేము భార్య భర్తలనీ రాశారని ఈ సందర్భంగా వారి గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఒక దర్శకుడికి వార్నింగ్ ఇచ్చారట కదా.. సినిమాలో అవకాశం ఇవ్వకపోతే కెమెరాలు ఎత్తుకెళ్లి పోతానని వార్నింగ్ ఇచ్చారని అలీ అడగడంతో అందుకు సంపత్ సమాధానం చెబుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా చేయబోతున్నారు ఈ క్రమంలోనే అందులో నాకు ఛాన్స్ ఇవ్వకపోతే కెమెరాలన్ని ఎత్తుకెళ్లి పోతా అంటూ తనకు సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చానని ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…