SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!
SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 2020 అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా పని చేస్తున్నారు.
ఇక మహేష్ బాబుతో ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు.మహేష్ బాబు 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా తన 28వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కుతుంది.
సర్కారీ వారి పాట చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా మహేష్ బాబు కాలికి సర్జరీ కావడంతో ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారీ వారి పాట పూర్తయిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలు కానుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే మహేష్ అభిమానులకు డైరెక్టర్ శుభవార్త తెలిపారు.
ఏప్రిల్ నెలలో ఈ సినిమాని స్టార్ట్ చేసి మే 31వ తేదీ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్ విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆరేడు నెలలో పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుంది కనుక ఈలోగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి త్రివిక్రమ్ అనుకున్న ప్లాన్ అమలవుతుందా.. ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన టార్గెట్ రీచ్ అవుతారో లేదో.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…