S.S Rajamouli: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన దృష్టి మొత్తం సినిమాల పై మాత్రమే ఉండటం వల్ల ఎలాంటి అనవసర విషయాలలో తలదూర్చకుండా తన పని తాను చేసుకు వెళ్లే స్వభావం కలవాడు.ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రాజమౌళి తాజాగా సోషల్ మీడియా వేదికగా సాయం చేయమని నెటిజన్లను కోరారు.అయితే బాహుబలి సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో భాగంగా సినిమాకి ఎంతో కష్టపడి పని చేసిన దేవికారాణి అనే మహిళ దురదృష్టవశాత్తు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రతి ఒక్కరూ ఆమెకు సహాయం చేయాలని జక్కన్న సోషల్ మీడియా వేదికగా కోరారు.
దీంతో నెటిజన్లు రాజమౌళి చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు మీరు సహాయం చేశారా అంటూ కొందరు ప్రశ్నించగా మరికొందరు మాత్రం ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే మీరు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇలా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొనే మీకు తనకు సహాయం చేయడం పెద్ద కష్టం కాదు.
మీరు తలుచుకుంటే దేవికారాణికి ఆపరేషన్ చేయించడం పెద్ద ఖర్చు కాదు. ఆ సహాయం ఏదో మీరే చెయ్యొచ్చుగా ఇలా అందరినీ అడగడం దేనికి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున రాజమౌళి పై కామెంట్ లు పెడుతూ అతనిని ట్రోల్ చేస్తున్నారు.మొత్తానికి మంచి చేయాలని భావించిన రాజమౌళికి ఇలా సోషల్ మీడియా వేదికగా చేదు అనుభవం ఎదురైంది.మరి ఈ విషయం పై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…